రాష్ట్రవిభజనతో మందుల సరఫరాకు బ్రేక్
హోమియో కేంద్రాలదీ అదేబాట
సిబ్బంది కొరతా సమస్యే..
వెంకటగిరి : ప్రాచీన భారతంలో ఆయుర్వేద వైద్యానికి ఎంతో విశిష్టత ఉంది.ఎన్నోదీర్ఘకాలిక వ్యాధులను మూలికలతో నయం చేసిన ఆయుర్వేద వైద్యం నేడు క్రమంగా ఆదరణ కోల్పోతోంది. ఆయుర్వేద వైద్యశాలలతోపాటు ఆయుష్ కేంద్రాలకు బాలరిష్టాలు తప్పడం లేదు. ప్రాచీన వైద్యంపై అవగాహన లేకపోవడం, అల్లోపతి వైద్యంపై మోజు పెరగడంతో సనాతన ఆయుర్వేదవైద్యం దీనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు ఆయుర్వేదవైద్యంపై ఆసక్తి కనబరచకపోవడంతో ప్రభుత్వం సైతం ఆయుర్వేద వైద్యశాలలకు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
అంతేగాక రాష్ట్రవిభజన అనంతరం ఆయుర్వేద వైద్యకేంద్రాలతోపాటు హోమియోవైద్యశాలలకు మందు ల సరఫరా నిలిచిపోయింది. తాజాగా మందుల సరఫరా కోసం ఇండెంట్ పెడితే నగదు చెల్లించి తీసుకోవాల్సిందే అంటూ హైదరాబాద్ రామంతపూర్లో ఆయుర్వేద, హోమియో మందుల సరఫరా కేంద్రం అధికారులు తేల్చి చెప్పడం, రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడ ంతో మందుల సరఫరాలో సమస్యలు ఎదరవుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న వైద్యశాలలు సిబ్బంది కొరత, అరకొర వసతులతో సతమతమవుతున్నాయి.
నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి:
నియోజకవర్గంలోని రాపూరు ఆయుర్వేద ఆసుపత్రికి భవనం లేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ గదిలో నిర్వహిస్తున్నారు. కలువాయి మండలం కుల్లూరులో ఉన్న హోమియోవైద్యశాలకు నెల్లూరు నుంచి వారంలో మూడు రోజులు మాత్రమే రోగులకు సేవలందిస్తున్నారు. సైదాపురం మండలం చాగణం, చావలిలలో ఉన్న ఆయుష్కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో వెంకటగిరి హోమియోవైద్యుడు ఓబులేసు డి ప్యుటేషన్పై వారంలో రెండు రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. వెంకటగిరి హోమియో వైద్యశాల వైద్యుడు పలు హోమియో వైద్యశాలలకు డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తూ సోమ, గురువారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. మోపూరు ఆసుపత్రి మూతపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం సిబ్బంది కొరత తీర్చి అన్ని రకాల వసతులు కల్పిస్తే పూర్వ వైభవం సాధ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు
హోమియో వైద్యం వల్ల రోగులకు ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆయుర్వేద, హోమియో వైద్యంపై ఆసక్తి చూపుతున్నారు. వెంకటగిరి ప్రాంతంలో కీళ్లనొప్పులు , చర్యవ్యాధులకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వారికి అవసరమైన మందులు డిమాండ్కు తగినట్లుగా సరఫరా కావడం లేదు.
- ఓబులేసు, హోమియోవైద్యుడు, వెంకటగిరి
ఆయుర్వేదానికి విభజన కష్టాలు
Published Thu, Aug 27 2015 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
Advertisement