సొసైటీ అధ్యక్షుల స్పష్టీకరణ..
కొరిటెపాడు(గుంటూరు): ఎన్నికల్లో రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నామని, రుణాలు రెన్యువల్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రకటనచేస్తే అలా చేయడానికి సిద్ధమేనని కొన్ని పీఏసీఎస్ల అధ్యక్షులు సవాల్ చేశారు. నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయంలో బుధవా రం పీఏసీఎస్ల అధ్యక్షులతో సమావేశం జరిగింది. తొలుత చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీకి ప్రయత్నాలు చేస్తోందని, ఈలోగా రైతులు అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని సూచించారు.
దీనికి పలు సొసైటీల అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయపూడి సొసైటీ అధ్యక్షుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరి మాట్లాడుతూ లక్ష రూపాయలకు రూ.15 వేల మేర వడ్డీ భారం పడుతుందని, పాత రుణాలు కట్టకపోతే కొత్త రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఇదంతా ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ పుణ్యమేనని మండిపడ్డారు. రైతులు తీసుకున్న రుణాలను వడ్డీతో కలిపి రెన్యువల్ చేయటం మంచి పద్ధతి కాదన్నారు. రుణమాఫీ చేయలేకపోతున్నామని, రుణాలను రెన్యువల్ చేసుకోవాలని చంద్రబాబుతో ప్రకటన ఇప్పిం చాలని డిమాండ్ చేశారు.
చైర్మన్ ముమ్మనేని స్పందిస్తూ తొలి విడత కొంతమొత్తం చెల్లించి మిగిలిన మొత్తానికి బాండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి చెల్లించిన రుణాలపై ఎలాంటి వడ్డీ ఉండదని, ఏప్రిల్ 1 నుంచి ఏడు శాతం, సెప్టెంబర్ ఒకటి నుంచి 11.75 శాతం వడ్డీ పడుతుందని వివరించారు. తర్వాత 13 శాతం వడ్డీ పడే అవకాశం ఉన్నందున వడ్డీ చెల్లించి రైతులు కొత్త రుణాలు పొందేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తొలి విడతగా జమచేసే మొత్తాన్ని రైతులకు అందిస్తామన్నారు. బ్యాంక్ వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి, సీఈవో మురళికృష్ణ, గుంటూరు డివిజన్లోని సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.
బాబు ప్రకటిస్తే రుణాలు రెన్యువల్కు సిద్ధమే..
Published Thu, Nov 6 2014 1:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement