సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరులో శుక్రవారం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఓవర్ యాక్షన్ చేశాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబరు ఐదో తేదీన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పునస్కరించుకుని గురుపూజోత్సవాన్ని జరుపుకుంటుంటే, గుంటూరులోని కొన్ని విద్యాసంస్థలు మాత్రం శనివారానికి వాయిదా వేశాయి. జిల్లా యంత్రాంగం ఆదేశాలకు అనుగుణంగా గురుపూజోత్సవ కార్యక్రమానికి దాదాపు పది వేల మంది విద్యార్థులను సమీకరించాయి. వీరిలో కొందరు రహదారికి ఇరువైపులా బారులు తీరి ఉండానికి, మరి కొందరు కార్యక్రమం జరిగిన పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు కేటాయించారు. ఉదయం తొమ్మిది గంటలకే వీరిని నిర్ధేశించిన ప్రాంతాలకు చేర్చారు. ముఖ్యమంత్రి కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అప్పటి వరకు తాగేందుకు తాగునీటిని కూడా సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు నీరసించిపోయారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి కార్యక్రమం తరువాత గురుపూజోత్సవాన్ని విద్యాసంస్థల్లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యక్రమం ఆలస్యం కావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు.
సీఎం కార్యక్రమం కారణంగా శుక్రవారం నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేశారు. కొన్ని సంస్థలు సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లితండ్రులకు ఎస్ఎంఎస్లు పంపాయి. కొన్ని విద్యాసంస్థలు అసలు కార్యక్రమమే నిర్వహించకపోతే మరికొన్ని శనివారం జరపడానికి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సాక్షి వివరణ కోరితే, విద్యాసంస్థలపై తామెటువంటి ఒత్తిడి తీసుకురాలేదని, కార్యక్రమం విజయవంతం చేసేందుకు కొన్ని సంస్థలు విద్యార్థులను తీసుకువచ్చాయని చెప్పారు.
‘బాబు’ కోసం గురుపూజోత్సవం వాయిదా
Published Sat, Sep 6 2014 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement