నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం! | Sakshi
Sakshi News home page

నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం!

Published Tue, Jul 15 2014 8:50 AM

నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం!

తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతునే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 5 గంటలు పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 
 
నేడు శ్రీవారి ఆలంయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఉదయం 11 గంటల వరకు శ్రీవారి ఆలయం శుద్ధి జరుగుతుందని, ఆతర్వాత మధ్యాహ్నం12 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుందన్నారు. 
 

Advertisement
Advertisement