లబోదిబో మంటున్న భీమోలు రైతులు
గోపాలపురం : మండలంలోని భీమోలు గ్రామంలో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలను వెంటనే చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేయవద్దని చెప్పకపోవడం దారుణమని రైతులు పేర్కొన్నారు.
ఎస్బీఐ తాళ్లపూడి బ్రాంచి నుంచి భీమోలు రైతులు 2011, 2012, 2013 సంవత్సరాలలో పంట రుణాలు తీసుకున్నారు. 15 రోజలలోగా అప్పు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు మాఫీ ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. రుణాలు మాఫీ అవుతాయని ఆశ పడ్డ రైతులకు ఈ నోటీసులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
వెంటనే రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం చులకనవుతుంది
వెంటనే రుణ మాఫీ చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం రైతులు, ప్రజలలో చులకన అవుతుంది. వాగ్దానాల ప్రకారం వ్యవసాయ రుణాలు మాఫీచేసి సన్నచిన్నకారు రైతులను ఆదుకోవాలి.
-వింటి వెంక ట్రావు, రైతు
చంద్రబాబు ప్రచారంతో వడ్డీ భారం పెరిగింది
బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలు తీర్చవద్దని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారంతో బకాయిలు పెరిగేలా చేసి ఇప్పుడు రైతు నడ్డివిరిచేలా వ్యవహరిస్తున్నారు.
-బండారు జగన్మోహన్రావు, రైతు
రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం
ఆరు నెలల క్రితం అకాల వర్షాలకు పంటలు పోయినా ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. తీసుకున్న అప్పులు తీర్చాలని బ్యాంకు అదికారులు నోలీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రుణమాఫీ పథకాన్ని అమలు చేయకపోతే ఆత్మహత్యలే శర ణ్యం
-బండారు ప్రసాద్, రైతు
అప్పు తీర్చాలంటూ బ్యాంకు నోటీసులు
Published Mon, Jul 7 2014 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement