- మహిళా ప్యానల్ ఓటమి
- ప్రభావం చూపిన ‘నోటా’
అనంతపురం లీగల్: అనంత న్యాయవాదుల సంఘం కార్యవర్గానికి బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా బి.మల్లికార్జున విజయం సాధించారు. ఆయనకు 144 ఓట్లు పోల్ కాగా, ఈశ్వరికి 96, జనార్దన్కు 75 ఓట్లు వచ్చాయి. నోటా కింద 9 ఓట్లు పోలయ్యాయి. మూడు ఓట్లు చెల్లలేదు. కాగా, ఉపాధ్యక్ష స్థానానికి జి.పద్మజ, కోశాధికారిగా ఎం.శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రధాన కార్యదర్శి స్థానానికి రాజేంద్రప్రసాద్, రామాంజనేయ చౌదరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా రాజేంద్రప్రసాద్ 18 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ స్థానానికి 22 ఓట్లు నోటాకు పడ్డాయి.
కార్యదర్శిగా గెలుపొందిన జయమోహన్ 165 ఓట్లు సాధించగా, మహిళా ప్యానెల్ అభ్యర్థి బి.సుజనకు 135 ఓట్లు, 22 ఓట్లు నోటాకు పడగా, 5 ఓట్లు చెల్లలేదు. కేఎస్ జయరాం మెమోరియల్ గ్రంథాలయ కార్యదర్శిగా బాలకృష్ణ 208 ఓట్లు సాధించి గెలుపొందారు. మహిళా ప్యానెల్ అభ్యర్థి మేడా అనూరాధకు 98 ఓట్లు పడగా 17 ఓట్లు నోటాకు 4 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎన్నికల నిర్వహణ అధికారులుగా సీనియర్ న్యాయవాదులు పీఎల్ ఈశ్వరరెడ్డి, రాజారాం, రాంకుమార్, గురుప్రసాద్లు, సహాయకులుగా శ్రీకాంత్రెడ్డి, మోహన్రావు, నరసింహులు(చిట్టి), జాఫర్సిద్దిఖి వ్యవహరించారు. కేవలం 20 మంది మాత్రమే ఉన్న మహిళలు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలు తమ ఉనికిని చాటాయన్నారు. రాయలసీమ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాల్మీకి గంగాధర్ విజేతలకు అభినందనలు తెలిపారు.
న్యాయవాది కృష్ణవేణి ఓటుపై వేటు
తాను సభ్యత్వ రుసుం చెల్లించినా ఓటు లేదనటంపై న్యాయవాది కృష్ణవేణి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 వరకు సభ్యత్వం ఉండేలా 2012 డిసెంబరులోనే ముందస్తుగా రుసుం చెల్లించాలనంటూ రసీదు చూపించినా ఫలితం లేకపోయింది. ఆమె సభ్యత్వం వివరాలున్న పేజీని కొట్టి వేసినందున ఓటుహక్కు ఇవ్వలేమని ఎన్నికల అధికారులు తెగేసి చెప్పారు. మాజీ అధ్యక్షుడు జి.నరసింహులు ఆమె సభ్యత్వాన్ని నిర్ధారించినా ఫలితం లేకపోయింది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన జి.పద్మజ ఓటు వినియోగించుకోవటానికి ఆమెను అనుమతించాలని కోరినా ససేమిరా అనటంతో విధిలేక కృష్ణవేణి వెనుతిరిగారు. బార్ అసోసియేషన్ సభ్యత్వ లెడ్జరులో తనకు సంబంధించిన వివరాల కొట్టివేతకు కారణాలు చూపాలని డిమాండు చేశారు.
బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మల్లికార్జున గెలుపు
Published Thu, Jun 19 2014 4:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement