సాక్షి, హైదరాబాద్: ఎర్రకోటపై బీసీ జెండా ఎగురవేసి రాజ్యాధికారం సాధించేంతవరకు తమ పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిందన్నారు. న్యాయమైన ఈ డిమాండ్లు అమలు చేస్తేనే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దోమలగూడలోని ఎస్ఎంఎస్లో శుక్రవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కష్ణ, ర్యాగ రమేష్లతో కలిసి ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నూటపదకొండు సార్లు రాజ్యాంగాన్ని సవరించిన పాలకులు బీసీ సంక్షేమం, అభివృద్ధి కోసం ఒక్క సవరణనైనా చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. బీసీలకు పదవులు రాకుండా అగ్రకుల పెట్టుబడిదారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
బీసీలకు కావల్సింది వాటాలు, కోటాలు కాదని, డిల్లీ పీఠం కావాలన్నారు. కేంద్రంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి చర్యలు తీసుకోవడంలేదన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయిలో కనుమరుగవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 28 సార్లు సీఎంలను మార్చితే ఒక్క బీసీకి ఆ పదవి ఇవ్వలేదని, కాంగ్రెసు బీసీ నాయకుల్లో సమర్థులైన వారే లేరా? అని ప్రశ్నించారు. తాను బీసీ ఉద్యమకారుడిగానే ఉంటానే తప్ప ఒక ప్రాంతానికి పరిమితం కానని, రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో బీసీ ముఖ్యమంత్రినే నియమించాలన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలని తమపై ఒత్తిడి వస్తోందని, బీసీలకు న్యాయం చేయకపోతే ప్రజలే పార్టీని ఏర్పాటు చేసుకుంటారని చెప్పారు.
ఎర్రకోటపై బీసీ జెండా ఎగరేస్తాం: ఆర్.కృష్ణయ్య
Published Sat, Aug 24 2013 1:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement