ఎక్సైజ్శాఖను సంక్షేమ శాఖగా మార్చుతాం
మంత్రి కొల్లు రవీంద్ర
మంగళగిరి : రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి రూ.6,460 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వచ్చిన ఆయన స్థానిక శివాలయంలో రెండు గంటల పాటు వినాయకహోమం నిర్వహించారు. అనంతరం నృసింహుని దర్శించుకుని ఆలయ సన్నిధిలో కొలువై వున్న శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ ఈ నెలతో ముగియనుందని, కొత్తపాలసీని రెండు మూడు రోజులలో నిర్ణయిస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖను సైతం సంక్షేమశాఖగా మార్చి బె ల్ట్ షాపులను లేకుండా చేయడంతో పాటు మద్యం అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా త్వరలోనే రూ.165 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఉపాధి కల్పించే పరిశ్రమలకు 40 శాతం సబ్సిడీతో బీసీలకు రుణాలు అందజేస్తామన్నారు. మంత్రి వెంట పార్టీ నాయకులు గంజి చిరంజీవి, సంకా బాలాజిగుప్తా, నందం అబద్దయ్య, వల్లభనేని సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
రూ.6,460 కోట్లతో బీసీ సబ్ ప్లాన్
Published Wed, Jun 17 2015 1:32 AM
Related news
-
మద్యం ప్రియులకు దొరకని బీర్లు
మెదక్: టెండల్లో బుసబుస పొంగే చల్లని బీరు తాగి ఉపశమనం పొందాలనుకునే మందుబాబులకుకష్టకాలమొచ్చింది. వైన్ షాపుల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం డిపోలు ప్రధాన బ్రాండ్ల బీర్లపై రేషన్ విధించడంతో అటు వైన్షాప్ యజమానులు.. ఇటు కొనుగోలు దార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో మద్యం ప్రియులు దొరికిన దానితోనే సరి పెట్టుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఇండెక్స్ ఆధారంగా 20 నుంచి 25 కేసులు ఇస్తుండగా.. ఇది ఒక రోజుకు కూడా సరిపోదని మద్యం వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్లో ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 49 వైన్ షాపులు, ఐదు బార్లు ఉన్నాయి. ఈయేడు ఎక్సైజ్ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొంత మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. గతేడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు రూ.194.68 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, ఈసారి నాలుగు నెలల కాలంలో రూ.206.71 కోట్ల విక్రయాలు జరిగాయి. మందు బాబుల పరేషాన్.. వేసవి ఎండలు ముదరడంతో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుతం నీటి కొరత, బీర్ల ఉత్పత్తి షరతులు తదితర కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడింది. అలాగే బీరు కాలపరిమితి 6 నెలలు ఉండటంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచలేని పరిస్థితి. గతేడాది నాలుగు నెలల కాలంలో 2,68,763 కేసులు అమ్మగా, ఈయేడు మార్చి 31 వరకు 2,96,977 కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సాధారణ బ్రాండ్లు లభిస్తున్నప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లు దొరకడం లేదు. దీంతో ఇండెక్స్కు అనుగుణంగా 20 నుంచి 25 కేసులు లభ్యతను బట్టి ఇస్తున్నారు. అలాగే సామాన్యుడికి అందుబాటు ధర కలిగి, నిత్యం ఎక్కువగా అమ్ముడు పోయే ఓ బ్రాండ్ లిక్కర్ కొరత కారణంగా దానికి కూడా రేషన్ విధించినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. పెరిగిన 10.50 శాతం ఎక్సైజ్ స్టేషన్ల వారీగా మద్యం అమ్మకాలు చూస్తే గతేడాది నాలుగు నెలలు (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి) నర్సాపూర్లో రూ.7,172.2 లక్షలు విక్రయాలు జరుగగా ఈసారి నాలుగు నెలలు రూ.7,888.2 లక్షలు, మెదక్లో గతేడాది రూ.6,847.6 లక్షలు ఉండగా, ఈసారి రూ.6,902.4 లక్షలు, రామాయంపేటలో గతేడాది రూ.5,447.9 లక్షలు కాగా, ఈసారి రూ.5,880.2 లక్షలు విక్రయించాయి. మొత్తం మీద గతేడాది నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి జిల్లా వ్యాప్తంగా 6.18 శాతం మద్యం విక్రయాలు వృద్ధి చెందాయి. అలాగే గతేడాది బీర్లతో పోలీస్తే ఈ నాలుగు నెలల్లోనే బీర్ల వినియోగం 10.50 శాతం పెరిగింది. ప్రతీయేటా వేసవి కాలంలో బీరు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. డిమాండ్ కనుగుణంగా సరఫరా లేక పోవడంతో ప్రధాన బ్రాండ్లపై రేషన్ విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
‘టానిక్’ వెనుక కీలక వ్యక్తులు ఎవరు?.. వెలుగులోకి సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో వందల కోట్ల అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ జీవో జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయ్యింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. 2016 నుండి 2019వరకు అన్ లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్కు అనుమతి లభించగా, ఐదేళ్లకు ఒకసారి షాప్ రెన్యూవల్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్కు ఐదు లక్షలు మాత్రమే అదనంగా యానివల్ ఫీజు నిర్ణయించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదీ చదవండి: టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత! -
టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!
హైదరాబాద్, సాక్షి: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్ను 2016లో ప్రత్యేక జీవో 271ను పేరిట జారీ చేసింది గత ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే.. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే.. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్ చేసింది. దీంతో.. టానిక్ కు ఎలైట్ వైన్ షాప్ పర్మినెంట్ అనుమతి సులువైంది. అయితే.. తెలంగాణ లో ఒక్క ఎలైట్ ఔట్ లెట్కు మాత్రమే అనుమతి ఇవ్వగా.. హైదరాబాదు, నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను ‘Q By టానిక్’ పేరుతో నిర్వహిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం.. ఎలైట్ వైన్స్ లైసెన్స్ ట్రాన్స్ఫర్కు అవకాశమే లేకపోవడం గమనార్హం. ఇక.. ఈ లైనెస్స్ ప్రకారం లిక్కర్ను బాటిల్స్గా మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్కు అనుమతి లేదు. ఇతర పానీయాలు ,ఆహార పదార్ధాల అమ్మకానికి వీలులేదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో సాధారణ మద్యం లైసెన్స్ అనుమతులు తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరపడం ఇక్కడ కొసమెరుపు. రీటైల్గా ఫారెన్ లిక్కర్ తోపాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్కు వెసలుబాటు కల్పించారు. ఇక.. టానిక్ వైన్ మార్టులో పని చేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్రాచైజీల్లో బడా బాబుల పిల్లల పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వ అనుమతులతోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు శివారులో వైన్ మార్టులు ఏర్పాటు చేసింది టానిక్. ఇందుకు ఓ ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్లో ఏర్పాటైన టానిక్ మార్టులో ఈ ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలాగే సీఎంవో మాజీ అధికారి ఒకరి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. టానిక్ షాపులకు ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్ లిక్కర్ దుకాణాల మాదిరే రాత్రి 11 గం. వరకే అమ్ముకోవాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం ప్రకటించింది. ఇక.. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు -
మద్యం ధరలు పెంచొద్దు
సాక్షి, హైదరాబాద్: మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమ వారం సచివాలయంలో ఎక్సైజ్, టూరిజం శాఖల అధికారులతో సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపైనే కాకుండా కట్టడిపైనా దృష్టి పెట్టి పనిచేయాలని కోరారు. ఎలైట్ బార్ల తో పాటు ఎలైట్ షాప్ల విషయంలో ఏకీకృత విధానాలను అమలు చేయాలని, రాష్ట్రమంతటా ఒకటే నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాలు రూ పొందించాలని కోరారు. పోలీస్, సమాచార శాఖలతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ను కట్టడి చేయాలని ఆదేశించారు. ఇందుకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో పురాతన కట్టడాలు, దేవాలయాలు ఉన్న ప్రదేశాల్లో టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను అన్వేషించాలని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవాదాయ, పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని భట్టి కోరారు. తగిన మార్కెటింగ్ వ్యవస్థ లేని కారణంగా సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశాలను వినియోగించుకోలేక పోతున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అన్ని టూరిజం ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపట్టలేదని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రైవేటు కంపెనీల పెట్టుబడులకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. సమావేశంలో భాగంగా కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం, చెక్పోస్టుల పటిష్టత కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు నిధులను కోరగా కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, స్పిల్ఓవర్ పనులకు టూరిజం శాఖ నిధులను ప్రతిపాదించింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.
Related News by category
-
ఐరాస సదస్సుకు ఏపీ సర్పంచ్
సాక్షి, అమరావతి: అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీన నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ (సీపీడీ) సదస్సులో పాల్గొనే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమారికి దక్కింది. ‘భారత్లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐరాస నుంచి ఆహా్వనం అందింది. మే 1వ తేదీన ఆమె న్యూయార్క్కు బయలుదేరతారు. హేమకుమారి 2021 ఏప్రిల్లో పేకేరు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజీలో 2014–19 మధ్య ఐదేళ్లపాటు ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్గా పనిచేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేవలం మూడు రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్యసమితికి సిఫార్సు చేసింది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన సర్పంచ్ హేమకుమారితో పాటు తిప్రుర రాష్ట్రానికి చెందిన సెపాహిజాల జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్దత్తా, రాజస్థాన్లోని ఝుంజున్ జిల్లా లంబిఅహీర్ సర్పంచ్ నీరూ యాదవ్కు ఆహా్వనాలు అందాయి. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్కుమార్తో కలిసి భారత్ ప్యానల్ తరఫున మన రాష్ట్రంలోనూ, దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళతారు. జగన్ పాలనలో అంతర్జాతీయ వేదికలపై అరుదైన గౌరవాలు ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నతస్థాయి అంతర్జాతీయ వేదికలపై మన రాష్ట్రానికి అనేక ఆరుదైన గౌరవాలు దక్కాయి. 6 నెలల క్రితం న్యూయార్క్ నగరంలోని యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో పాల్గొనేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే లారీ డ్రైవర్ కూతురు, సెక్యూరిటీ గార్డు కూతురు, కౌలు రైతు కొడుకు తదితర 10 మంది పేద విద్యార్థులకు అవకాశం దక్కింది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. మనబడి నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. బడిలో స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి సర్కారు బడి స్థాయిని కూడా ప్రైవేట్ అంతర్జాతీయ స్కూళ్ల స్థాయిలో ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు సైతం ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనే స్థాయికి ఎదిగారు. -
సెగలు.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. -
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ షెడ్యూల్ను సోమవారం ఆయన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో ఉన్న కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో.. మధ్యాహ్నం 12.30 గంటలకు కడప లోక్సభ స్థానం పరిధిలో ఉన్న మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో ఉన్న పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అమరావతి: స్టార్ క్యాంపెయినర్లు.. ప్రతి పార్టీలోనూ ప్రముఖ నాయకులు వీళ్లు.. సభలకు వస్తారు.. చేతులూపుతారు.. ఏదేదో చెప్పేస్తారు.. వారి పార్టీ వారికి ఓటేయమని కోరుతూ ఓ దండం పెట్టేసి హెలికాప్టరో, విమానమో ఎక్కేసి వెళ్లిపోతారు. కానీ, జగన్ నేతృత్వంలోని ప్రజల పార్టీ అయిన వైఎస్సార్సీపీకి స్టార్లు, స్టార్ క్యాంపెయినర్లు కూడా సామాన్య ప్రజలే. జగన్ ప్రభుత్వం అందించిన చేయూతతో అభివృద్ధి సాధించి, కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్న సాధారణ ప్రజలే. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఈ సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా వైఎస్సార్సీపీ ఎన్నికల సమారానికి సిద్ధమైంది.ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. దీనినే కార్యరూపంలోకి తెస్తూ దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన కూడా చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని, వైఎస్సార్సీపీ 12 మంది సామాన్యులతో తన రాష్ట్రస్థాయి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్కు అందజేసింది. వీరంతా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయాన్ని వీరు సందర్శించారు. సీఎం వైఎస్ జగన్కు స్టార్ క్యాంపెనర్లుగా ఏ విధంగా మారారో వారిలో కొందరు వివరించారు. 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యేగా పనిచేశా ఈ ప్రభుత్వంలో వలంటీర్గా పనిచేశా. నా 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యే అన్నట్లు పనిచేశా. ప్రతి ఇంటికి వారికి ఏ పథకాలు అందాలో వాటన్నింటినీ పక్కాగా అందించాం. అదే ఊరికి చెందిన నాకు ఆ కటుంబాలు గతంలో ఎలా ఉండేవి, నవరత్నాలతో ఆర్థిక భరోసా అందిన తరువాత ఎలా మారాయో నాకు స్పష్టంగా కనిపించింది. ఈ ఐదేళ్లలో నిజమైన అభివృద్ధిని చూశా. ఆర్థిక కారణాలతో పిల్లలను చదువించుకోలేని ప్రతి కుటుంబానికీ సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. భర్త సంపాదన మీద మాత్రమే బతికే ప్రతి అక్కకు, చెల్లెమ్మకు సీఎం జగనన్న అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించారు. ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ఈ ప్రభుత్వం మహిళలను నిజమైన ఇంటి యజమానిని చేసింది. నా క్లస్టర్లోని సగం కుటుంబాలు స్థానికంగా, పక్కనే ఉన్న పట్టణాల్లో సొంత వ్యాపారాలు ప్రారంభించాయి. తద్వారా ప్రతిరోజూ రూ. 1,000 వరకు సంపాదించుకుంటున్నాయి. వారి జీవితాల్లో చాలా మార్పు వచి్చంది. ఒక తల్లిగా ఆలోచిస్తే మా పిల్లలకు అవసరమైన చదువులు, అవసరాలు అన్నీ పాఠశాలల్లో లభిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడని నేను నమ్ముతున్నాను. – ఈశ్వరి, కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లాసీఎం జగన్ చలవతో నా కుమారుడు అమెరికాలో చదువుతున్నాడు నాకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి కిషోర్ డిగ్రీ పూర్తి చేసి డిల్లీలోని మారుతి సుజుకీలో ఉద్యోగం చేసేవాడు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పొలిటికల్ అఫైర్స్లో సీటు సంపాదించాడు. కోర్సు ఫీజు రూ.1.36 కోట్లు అవుతుందన్నారు. ఈ మాట నాకు చెప్పగానే కనీసం రూ. లక్ష అయినా మనం కట్టలేం.. మంచి ఉద్యోగం చూసుకో అని చెప్పా. ఆ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేశాం.నా కొడుకు చదువుకు కావాల్సిన డబ్బు విదేశీ విద్య కింద మంజూరైంది. ఇప్పటికే రెండు సెమిస్టర్లు పూర్తి చేసిన నా కుమారుడికి రెండు దఫాలుగా రూ. 50 లక్షలు అందింది. ఇది చూసిన నాకు లక్ష రూపాయలు కట్టలేని నా కుమారుడు ఇంత పెద్ద మొత్తం ఫీజుతో విదేశీ విశ్వవిద్యాలయంలో చదవగలుగుతున్నాడని గర్వంగా అనిపించింది. ఒక్క నా కుమారుడే కాదు.. ఇలా చాలా మంది పేదల పిల్లలు విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇదంతా సీఎం వైఎస్ జగన్ చలవే. అందుకే సీఎం జగన్ కోసం స్టార్ క్యాంపెయినర్ అయ్యాను. – పండలనేని శివప్రసాద్, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లాసీఎం జగన్ ఆలోచనలకు సంపూర్ణ మద్దతు జగనన్న చేదోడు అందుకున్న మా ఇంటి పక్కనే నివాసం ఉండే శారద బట్టల షాపు ఏర్పాటు చేసుకుని కుటుంబానికి అండగా నిలుస్తోంది. దాసరి మహాలక్ష్మి అనే మహిళకు భర్త మరణిస్తే రూ. 2 లక్షల బీమా అందింది. దీంతోపాటు పెన్షన్, ఆసరా, అమ్మఒడి పథకాలూ అందుతున్నాయి. మాది కూడా నిరుపేద కుటుంబం. జగననన్న ప్రభుత్వంలో అందిన నవరత్నాలతో రోజు గడవడమే కష్టంగా ఉండే దుస్థితి నుంచి నిలకడ ఆదాయం అందుకునే స్థితికి వచి్చంది. మా కుటుంబాలను ఆర్థికంగా నిలబడేలా ఆదుకున్న ప్రభుత్వానికి మేమెందుకు అండగా నిలవకూడదు? పేదలను పేదరికం నుంచి తప్పించి మెరుగైన జీవితం కల్పించాలనే సీఎం జగన్ ఆలోచనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అందుకే సీఎం జగన్ కోసం స్టార్ క్యాంపెయినర్గా పనిచేసేందుకు ముందుకు వచ్చా. – ఎ. అనంతలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లాప్రభుత్వ పాఠశాలల్ని చూస్తే తేడా తెలుస్తుంది సీఎం జగన్ పరిపాలన ఏమిటో చెప్పేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే ఉదాహరణ. నేను డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్లే అయ్యింది. మేం చదువుకునే సమయంలో ప్రభుత్వ పాఠశాలలి్న, ఇప్పడు నాడు – నేడు కింద పూర్తిగా మారిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తే తేడా అర్ధమవుతుంది. అప్పటి ప్రభుత్వ పాఠశాలలు తలుపులు లేక గేట్లు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. కనీసం బాలికలకు టాయిలెట్లు కూడా లేని దుస్థితి. ఇలాంటి స్కూళ్లలో బాలికల విద్య ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అంతర్జాతీయ స్థాయి. సకల సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూంలు, ట్యాబ్లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను బోధిస్తున్నారు. మరో పదేళ్లలో ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ట్రం మరో ఎత్తుకు ఎదుగుతుంది. ఇంగ్లిష్ చదువులతో కొన్ని లక్షల కుటుంబాల తలరాత మారిపోతుంది. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తాను. – అన్వర్, నెల్లూరు జిల్లాఒక అడుగు ముందుకు వేశాం ద్విచక్ర వాహనాలకు సీట్ కవర్లు కుట్టే ఒక చిన్న షాపు నాది. రోడ్డు పక్కన పెట్టుకున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. నా రోజువారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. పిల్లలను బాగా చదివించాలని ఆశ ఉన్నా చదివించే ఆర్థిక స్థోమత లేదు. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్లో చేరిన నా కొడుకుకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలతో ఆదుకున్నారు. నా కుమారుడు బాగా చదువుకున్నాడు. రెండో కొడుకు కూడా ఫీజు రియింబర్స్మెంట్ డబ్బుతో డిగ్రీ చదువుతున్నాడు. మూడో కొడుకుకి అమ్మఒడి అందుతోంది. నా సంపాదన అరకొరే అయినా, నా పిల్లల చదువు ఏ ఆటంకం లేకుండా సాగుతోంది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సాధించాడు. సీఎం జగన్ ఇచ్చిన ఒక్క పథకం కింద చదువుకున్న నా కొడుకు నా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చాడు. మేము సమాజంలో ఒక అడుగు ముందుకు వేసినట్లైంది. ఇలాంటి వేలాది పేదింటి పిల్లలకు సీఎం జగన్ చదువులు చెప్పిస్తున్నారు. – కటారి జగదీష్ , మల్లవీధి, అనకాపల్లి -
సుజలాంధ్ర.. సుఫలాంధ్ర..
లక్ష్యాన్ని సాధించలేని వారే సాకులు వెతుక్కుంటారు. కార్యసాధకులకు సాకులు అడ్డురావు. అవకాశాలను అన్వేషించి మరీ లక్ష్యాలను సాధిస్తారు. ఇందులో మొదటి తరహా వ్యక్తి చంద్రబాబు అయితే రెండో తరహా నేత సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి. పద్నాలుగేళ్లు సీఎంగా పని చేశానని గొప్పలు చెప్పుకుంటూ.. తన కుప్పం నియోజకవర్గానికే నీటిని తెచ్చుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ఐదేళ్ల పాలనలో మూడేళ్లలోనే ఆరుప్రాజెక్టులు పూర్తి చేసి, మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేసిన జల రుషి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి. చంద్రబాబు పాలనంతా కరవు మయం. ఏటా కరవు మండలాల ప్రకటన. ప్రభుత్వ సాయం అందక రైతుల హాహాకారాలు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా విపత్తు రెండేళ్ల పాటు కర్కశంగా ఆర్థిక స్థితిని కుదేలు చేసినప్పటికీ, జగన్ ప్రభుత్వం సాకులు వెతుక్కోలేదు. జన సంక్షేమమేపరమావధి అనుకున్నారు. మూడేళ్ల వ్యవధిలోనే ప్రాజెక్టుల్లో నీటి ఉరవడిని మడుల్లోకి మళ్లించిన ఖ్యాతి జగన్కు మాత్రమే దక్కుతుంది. - ఆలమూరు రాంగోపాల్రెడ్డి, సాక్షి, అమరావతి:సాక్షి, అమరావతి: రాష్ట్ర సాగునీటిరంగంలో నవచరిత్రను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఖించారు. కరోనా మహమ్మారి ప్రభావం.. లాక్ డౌన్ల దెబ్బతో దాదాపు రెండేళ్లపాటు దేశంలో ఎక్కడా ప్రాజెక్టుల పనులు చేయలేని పరిస్థితి. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. కేవలం మూడేళ్లలోనే ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేశారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా.. బ్రహ్మంసాగర్ మట్టికట్టలకు డయాఫ్రమ్ వాల్ వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మొత్తం 6 రిజర్వాయర్లలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేశారు. యాజమాన్య పద్ధతుల ద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. చరిత్రలో మహోజ్వల ఘట్టం వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా చేపట్టి, పూర్తి చేస్తున్నారు. 2019, మే 30 నుంచి ఇప్పటి వరకూ పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.35,268.05 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టులపై పెట్టిన ప్రతి పైసాను సది్వనియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. రైతులకు అందించారు. పెన్నా డెల్టా సుభిక్షం జల యజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్లలో మిగిలిన పనులను సీఎం వైఎస్ జగన్ రూ.216.88 కోట్లు వెచ్చిచి పూర్తి చేసి.. 2022, సెపె్టంబరు 6న జాతికి అంకితం చేశారు. తండ్రి ప్రారంభించిన బ్యారేజ్ల పనులను తనయుడు పూర్తి చేసి, జాతికి అంకితం చేయడాన్ని సాగునీటిరంగ చరిత్రలో మహోజ్వలఘట్టంగా అధికారవర్గాలు అభివరి్ణస్తున్నాయి. పెన్నా డెల్టాలో 4.83 లక్షల ఎకరాలకు సమర్థంగా నీళ్లందించడమే కాకుండా ఆ రెండు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిల ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చారు. పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలను వరద ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా డెల్టా ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల వాటిలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. ఆ తర్వాత గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు రూ.580 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్ను నింపడానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీల వల్ల 2019 వరకూ కేవలం నాలుగైదు టీఎంసీల నీటినైనా నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్వాల్ నిర్మించి.. లీకేజీలకు అడ్డుకట్ట వేసి.. పూర్తి స్థాయిలో అంటే 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. దశాబ్దాల కల సాకారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ. ఆ ప్రాజెక్టును 2005లో మహానేత వైఎస్ చేపట్టి పనులు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడటంతో వెలిగొండ పనులు పడకేశాయి. జగన్ అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021, జనవరి 13 నాటికే పూర్తి చేశారు.రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ. పనులను పూర్తి చేసి.. రెండు సొరంగాలను మార్చి 6న జాతికి అంకితం చేశారు. ఇప్పటికే ఫీడర్ చానల్, నల్లమలసాగర్ పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు నీటిని తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. వెలిగొండతో ప్రకాశం జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. బాబు జమానా అవినీతి ఖజానా కడలిపాలవుతోన్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే సారి రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులను చేపట్టారు. అప్పట్లోనే 23 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మిగతా 40 ప్రాజెక్టుల్లో(పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి) మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని 2014, జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. జూన్ 8, 2014 నుంచి మే 29, 2019 వరకూ సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,293.94 కోట్లను ఖర్చు చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పట్టిసీమ, పురుషోత్తపట్నం మినహా మిగతా 40 జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు ఖర్చు చేశారు. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే రూ.24,465.12 కోట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే.. సాగునీటి ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారన్నది అర్థం చేసుకోవచ్చు. నీటిపారుదల రంగ చరిత్రలో రికార్డు కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి. జగన్ అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. కోటి ఎకరాలకు జలధారలు విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ దుర్భిక్షంతో రాష్ట్ర రైతులు, ప్రజలు తల్లడిల్లిపోయారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదులలో నీటి లభ్యత పెరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కలిపి ఏటా కోటి ఎకరాలకు జగన్ నీళ్లందించారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేశారు.రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులు సాధించి రాష్ట్రాన్ని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం వైఎస్ జగన్ నిలిపారు. వాతావరణ మార్పుల వల్ల కృష్ణా నదికి వరద రోజులు తగ్గిన నేపథ్యంలో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజుల్లో దానిపై ఆధారపడ్డ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శరవేగంగా పోలవరం రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరాన్ని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సాకారం చేస్తూ జలయజ్ఞంలో భాగంగా చేపట్టి.. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరంలో విధ్వంసం సృష్టించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021, జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవునా మళ్లించారు. చంద్రబాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్పై కేంద్ర జలసంఘం స్పష్టత ఇచ్చాక.. ఆ పనులు పూర్తి చేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించి.. జాతికి అంకితం చేయనున్నారు.గండికోటలోకి బిరబిరా కృష్ణమ్మ గాలేరు–నగరిలో అంతర్భాగంగా అవుకు వద్ద రెండు సొరంగాలను చేపట్టారు. ఇందులో ఒక సొరంగం దివంగత సీఎం వైఎస్ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగాన్ని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. రెండు సొరంగాలను రూ.567.94 కోట్లతో పూర్తి చేసి.. నవంబర్ 30, 2023న సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు అవుకు వద్ద మూడో సొరంగం పనులను చేపట్టారు. ఈ పనులకు ఇప్పటికే రూ.934 కోట్లు ఖర్చు చేశారు. మూడో సొరంగమూ దాదాపు పూర్తయింది. దాంతో శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే వరద కాలువ ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించి.. గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. తద్వారా 2.60 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరందించనున్నారు. తద్వారా 1.31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 20 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పానికి కృష్ణా జలాలు..: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను రూ.560.29 కోట్లతో సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి, ఫిబ్రవరి 26న జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపి, 6,300 ఎకరాలకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పం నియోజకవర్గానికి 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు అవినీతికి పాల్పడటం వల్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేయలేక చేతులెత్తేస్తే.. జగన్ పూర్తి చేయడం అబ్బురం...అపూర్వం.వలసలకు అడ్డుకట్ట హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి లక్కవరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా పది వేల ఎకరాలను సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని రూ.224.31 కోట్లు వెచ్చిచి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18, 2023న జాతికి అంకితం చేశారు. సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించడం ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని పశ్చిమ మండలాల్లో వలసలకు అడ్డుకట్ట వేశారు. కోనసీమలా రెండు పంటలు బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీల వల్ల గతంలో ఎన్నడూ మూడు నాలుగు టీఎంసీలు కూడా నిల్వ చేసిన దాఖాలాలు లేవు. తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీటి మాట దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కావు. బ్రహ్మంసాగర్ ఉన్నా ఏం ప్రయోజనం లేదని బాధపడేవాళ్లం. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్ లీకేజీలకు డయాఫ్రమ్ వాల్ వేసి అడ్డుకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు 17.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. దాంతో కోనసీమ తరహాలో ఆయకట్టులో రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు ఫలాలు నిజంగా రైతులకు అందుతున్నది ఇప్పుడే. – పోచంరెడ్డి రఘురాంరెడ్డి, సోమిరెడ్డిపల్లి, బ్రహ్మంగారిమఠం మండలం, వైఎస్సార్ జిల్లా. సంగం బ్యారేజ్తో కష్టాలు తీరాయి బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సంగం ఆనకట్ట శిథిలమవడంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు 2004లో మహానేత వైఎస్ నాడు సంగం బ్యారేజ్ పనులు చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా సాగాయి. మహానేత వైఎస్ మరణించాక బ్యారేజ్ పనులు పడకేశాయి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పనులు పూర్తి చేసి సమృద్ధిగా నీళ్లందిస్తున్నారు. దాంతో నాకున్న 13 ఎకరాలతోపాటు 40 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. – మల్లవరం రామకృష్ణ, పడుగుపాడు, కోవూరు మండలం
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement