సాక్షి, రంగారెడ్డి జిల్లా:
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనుకోలేదు.. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందడం ఇప్పటికీ కలగానే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సాఫీగా పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు బహుమతిగా ఇద్దాం.’ అని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్లో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు. తెలంగాణ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు నాటకాలాడాయని, కాంగ్రెస్ ధృడసంకల్పంతో ముందుకు సాగిందన్నారు. పార్టీలో అన్నివిధాలా పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీతోనే మహిళలకు, మైనార్టీలకు ప్రత్యేక స్థానం దక్కిందన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. సీమాంధ్రలో కొందరు నేతలు పదవులు అనుభవించి పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవడం సరికాదన్నారు. నేతలు, కార్యకర్తలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. పార్టీ ఎవరి సొంతం కాదని, వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని అన్నారు. డీసీసీ సమావేశాలకు గైర్హాజరయ్యే కొందరు నేతలు.. సొంత ప్రాంతంలో తామే బలవంతులమని చెప్పుకుంటున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ సమావేశాలకు హాజరుకాని మండల బాధ్యులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దేశంలో మతోన్మాద శక్తులు రాజ్యమేలేందుకు కుట్ర పన్నుతున్నాయని, ప్రజల్లో ఈ అంశాన్ని వివరించి వాటికి అడ్డుకట్ట వేయాలని పిలుపుని చ్చారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు నాగయ్య, కార్యదర్శులు టీ.రామ్మోహన్రెడ్డి, ఆదిత్యరెడ్డి, పార్టీ నేతలు కాలె యాద య్య, రమేష్, కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డుమ్మా ఎందుకు?
విస్తృతస్థాయి సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మంత్రి ప్రసాద్తోపాటు కె.లకా్ష్మరెడ్డి, ఆకుల రాజేందర్ మినహా మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీ యాంశమైంది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో అధినేత్రికి కృతజ్ఞతలు చెప్పేందుకే మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంపై కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఐక్యంగా సాగుదాం.. అన్ని సీట్లూ గెలుద్దాం
Published Tue, Feb 25 2014 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement