సీఎం సభలో అవరోధాలు సృష్టించొచ్చు
బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి అదనపు ఎస్పీ ఆదేశాలు
కర్నూలు: సీఎం బహిరంగ సభలో కొంతమంది అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి బందోబస్తు విధులు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో సోమవారం సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయానికి తరలివచ్చారు. పరేడ్ మైదానంలో హాజరైన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందికి అదనపు ఎస్పీ సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు చెక్పోస్టు, బస్టాండు, రైల్వే స్టేషన్ లాడ్జీలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద వీవీఐపీలను మాత్రమే అనుమతించాలని సూచించారు.
అనుమానితులు కనిపించగానే సంబంధిత సెక్టార్ ఇన్చార్జీలకు వెంటనే సమాచారం అందించాలన్నారు. అనంతరం ఏపీఎస్పీ రెండవ పటాలంలోని హెలిప్యాడ్, ప్రభుత్వ అతిధిగృహం, ఔట్డోర్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ రిహార్సల్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, కె.శ్రీనివాసులు, వై.హరినాథ్రెడ్డి, బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు.
బాంబ్ స్వ్కాడ్ బృందాలుముమ్మర తనిఖీ:
మూడు బాంబ్స్క్వాడ్ బృందాలు, రెండు డాగ్స్వ్కాడ్ బృందాలు సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఏపీఎస్పీ మైదానంలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ఔట్డోర్ స్టేడియంలోని బహిరంగ సభ స్థలం వరకు రోడ్లకు ఇరువైపులా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
వాహనాల పార్కింగ్ స్థలాలు ఇవే
►వీఐపీ వాహనాల పార్కింగ్ ఎస్టీబీసీ కళాశాల మైదానం.
►స్కూలు విద్యార్థులు, మహిళా సంఘాలు, ఇతర ప్రజలు తరలివచ్చే వాహనాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్.
►బహిరంగ సభకు ప్రవేశ ద్వారాలు
►వీవీఐపీలకు ఔట్డోర్ స్టేడియం మెయిన్గేటు, మహిళా సంఘాలు, స్కూలు విద్యార్థులకు సింహపురి కాలనీ స్కూలు గేటు, మున్సిపల్ ఆఫీసు గేటు ద్వారా ప్రవేశం.
వాహనాల దారి మళ్లింపు
కర్నూలు నగరంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆదోని, కోడుమూరు వైపు నుంచి వచ్చే వాహనాలు బళ్లారి చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండు వైపు నిషేధం ప్రకటించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కల్లూరు, బిర్లాగేటు, కలెక్టరేట్, రాజ్విహార్ మీదుగా ఎగ్జిబిషన్ మైదానం చేరుకోవాల్సి ఉంటుంది.
అప్రమత్తంగా ఉండండి
Published Tue, Mar 8 2016 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement