పాత కక్షలతో తండ్రి, ఇద్దరు కొడుకులపై కాల్పులు
హత్య కేసులో కోర్టు వాయిదాకు కారులో వస్తుండగా ఘటన
జాతీయ రహదారిపైనే తెగబడిన దుండగులు
కిరాయి హంతకుల పనేనని పోలీసుల అనుమానం
విజయవాడ: ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన ఘర్షణలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకున్నాయి. గతంలో జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగా ప్రత్యర్థులు వారిని కిరాతకంగా హతమార్చా రు. పాత కేసులో కోర్టు వాయిదాకు హాజరయ్యేం దుకు కారులో వస్తున్న ఇద్దరు నిందితులతో పాటు వారి తండ్రిని విజయవాడ సమీపంలో దారికాచి తుపాకులతో కాల్చి చంపారు. కారు డ్రైవరు పరారై పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో 5వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్యర్థుల కాల్పుల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకడిమి గ్రామానికి చెందిన గందోడి(గంధం) నాగేశ్వరరావు(55), అతని కుమారులు పగిడి మారయ్య(36), గుంజుడు మారయ్య(32) మృతి చెందారు. వీరిపై 18 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగి పోలీసులు వివరించారు. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన జ్యోతిష్యుడు భూతం దుర్గారావు హత్య కేసులో ఆయన బంధువు కూరపాటి నాగరాజుతోపాటు ఇతని సోదరి కుమారులైన ఇద్దరు మారయ్యలు కూడా నిందితులుగా ఉన్నారు. హత్య జరిగినప్పటి నుంచి దుర్గారావు, నాగరాజు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి.
ఈ కేసులో బెయిల్పై విడుదలైన తర్వాత నిందితులంతా ముంబైలో తలదాచుకుంటున్నారు. అయితే ఏలూరు జిల్లా కోర్టులో కేసు విచారణ జరుగుతుండటంతో వాయిదాలకు మాత్రం వచ్చి వెళుతున్నారు. బుధవారం కూడా వాయిదాకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మారయ్యలను వారి తండ్రి నాగేశ్వరరావు కలుసుకున్నారు. అక్కడి నుంచి అద్దె కారులో ఏలూరు బయల్దేరారు. పెదఅవుటుపల్లి సమీపంలోకి రాగానే వీరి కారును కొందరు దుండగులు తమ వాహనంతో ఢీకొట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురినీ హతమార్చారు. ఘటనా స్థలాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. కేసు దర్యాప్తుకు, హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దుండగుల వేషధారణ, భాష, కాల్పులు జరిపిన తీరును బట్టి ముంబై లేదా హైదరాబాద్కు చెందిన ప్రొఫెషనల్ కిల్లర్స్గా పోలీసులు అనుమానిస్తున్నారు. వారు వాడిన వాహనాన్ని హనుమాన్జంక్షన్లో వదిలేసి వెళ్లడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి దుండగులు రాజమండ్రి వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. కాగా, దుండగులు వాడిన వాహనం దుర్గారావు సోదరుడు శ్రీనివాస్దని దర్యాప్తులో తేలింది.
బెజవాడలో ముగ్గురి దారుణహత్య
Published Thu, Sep 25 2014 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement