► వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నగర పంచాయతీ వైస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి
► అదే బాటలో మరికొందరు మండల, గ్రామస్థాయి నాయకులు
ఆళ్లగడ్డటౌన్: ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఇటీవలే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి అనుకోని పరిస్థితి ఎదురవుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉంటారని భావిస్తూ వచ్చిన ఆయనకు సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోంది. నగర పంచాయతీ వైఎస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడం, మరికొందరు గ్రామ, మండలస్థాయి నాయకులు ఆయన బాటలో వెళ్తుండడం ఇందుకు నిదర్శనం. శుక్రవారం ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ రామలింగారెడ్డి ఈ మేరకు బహిరంగంగానే ప్రకటించారు. ‘ఎవరో పార్టీని వీడినంత మాత్రాన నేను కూడా మారాలా? నాకు ఆ అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
డాక్టర్ రామలింగారెడ్డి, ఆయన భార్య డాక్టర్ సరోజిని దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఉంటూ, విద్యా సంస్థలు స్థాపించి, అంకాళ్రెడ్డి మెమోరియల్ సేవా ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు నియోజవర్గ ప్రజలకు సుపరిచితులుగా ఉన్నారు. గత నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 20 వార్డులకు 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయిండంతో వైఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మున్సిపాల్టీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో భూమా, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పార్టీ మారడంతో డాక్టర్ రామలింగారెడ్డి ఆయన వెంట వెళ్లారా? వారితో విభే దిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిరభ్యంతరంగా స్వీకరిస్తానని ఆయన ప్రకటించారు.
అదేబాటలో పలువురు
భూమానాగిరెడ్డి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడ టం జీర్ణించుకోలేని అనేకమంది లోలోన మదనపడుతున్నారు. ఎవరో ఒకరు ముందుకు వస్తే వారి నాయకత్వంలో పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. భూమా కుటుంబం పీఆర్పీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన సమయంలో ఆ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న అనేక కుటుం బాలు వైఎస్సార్పై ఉన్న అభిమానంతో కలిసి నడిచారు. ముఖ్యంగా ఉయ్యలవాడ, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లో ప్రధాన వర్గాలుగా ఉన్న ముస్లిం మైనార్టీ, క్రైస్తవులు, మరో సామాజిక వర్గం పూర్తిగా మద్దతు తెలిపింది. ఫలితంగానే పీఆర్పీ అభ్యర్థిగా కేవలం 2 వేల మెజార్టీతో గెలిచిన దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడి ఆ త ర్వాతి ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. ఇందులో చాలా వరకు వైఎస్సార్ అభిమానులే ఉన్నారన్న విషయం సుస్పష్టం. అలాంటి వీరంతా ప్రస్తుతం వైఎస్సార్సీపీ నాయకుని కోసం ఎదురుచూస్తున్నారు.
భూమాకు ఎదురుగాలి
Published Sat, Mar 5 2016 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement