Sakshi News home page

శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు

Published Tue, Dec 16 2014 12:08 PM

శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు - Sakshi

కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత శోభా నాగిరెడ్డి (46) జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.  ఇందులో భాగంగా ముందుగా నంద్యాల ఎమ్మెల్యే, భర్త భూమా నాగిరెడ్డి, కుమార్తె అఖిలప్రియలు శోభా ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏవీ కళ్యాణ మండపంలో నేత్ర, రక్తదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో 200 మంది రక్త దాతలు, అభిమానుల, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో పాటు అన్ని హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం, హరిజనవాడ, మురికివాడలల్లో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement