సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్లో భువనగిరి లోక్సభస్థానం కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కాదని తమకంటే..తమకు ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఆ పార్టీలోని కొందరు నేతలు వంతపాడుతున్నారు. దీంతో జిల్లా పార్టీలో ప్రచ్ఛన్న పోరు మొదలైంది. ఇప్పటికే ఢిల్లీస్థాయిలో కూడా ఎంపీకి వ్యతిరేకంగా నివేదికలు అందజేసిన నాయకులు కొద్దిరోజులు మౌనం పాటించారు. కానీ, తాజాగా సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్రెడ్డి తన కొడుకుకోసం విలేకరుల సమావేశంలో బహిరంగంగానే టికెట్ అడిగేశారు. దీంతో ఎంపీ రాజగోపాల్రెడ్డి తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తా రు. ఈ ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై జిల్లా సీనియర్నేతలు నోరు మెదపడం లేదు.
గుంపుల గొడవ
2009 ఎన్నికల్లో జిల్లాలో సీనియర్లు జానారెడ్డి, దామోదర్రెడ్డిలను కాదని వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అవకాశం కల్పిం చారు. దీనికి బలమైన కారణమే ఉంది. ఒక్కోనాయకుడు అదనంగా ఒక్కో అసెంబీ ్లస్థానంలో తమవారికి టికెట్ ఇప్పించుకున్నా ఒక్కరూ గెలిపించుకోలేదు. ఇలా, కోదాడ, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలు చేజారాయి. వీటితో పాటు మునుగోడు, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కానీ, కోమటిరెడ్డి తన సోదరుడు రాజగోపాల్రెడ్డిని భువనగిరి ఎంపీగా, చిరుమర్తి లింగయ్యను నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.
దీంతో జిల్లా కాంగ్రెస్పై ఆయన పట్టు బిగించారు. అప్పటి నుంచే కోమటిరెడ్డి, ఆయన వ్యతిరేకవర్గాలుగా జిల్లా కాం గ్రెస్ చీలిపోయింది. వైఎస్సార్ మరణానంతరం జానారెడ్డి తిరిగి మంత్రివర్గంలో చేరారు. తెలంగాణ డిమాండ్తో కోమటిరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీలో ఉంటూనే పోరాడారు. జిల్లాలో మంత్రి పదవి ఖాళీ కావడంతో ఉత్తమ్కుమార్రెడ్డికి అవకాశం దక్కింది. ఈ రెండు పరిణామాల తర్వాత జిల్లా కాంగ్రెస్ స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోమటిరెడ్డి సోదరుల వ్యతిరేకులంతా ఓ తాటిపైకి వచ్చారు. వీరంతా కలిసి, ఎంపీ రాజగోపాల్రెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు తయా రుచేయించి ఢిల్లీకి పంపారన్నది ఎంపీ వర్గీయుల వాదన.
వ్యూహాత్మకంగా.. రాజగోపాల్రెడ్డి అడుగులు
ఈ పరిణామాల నేపథ్యంలోనే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంపీ రాజగోపాల్రెడ్డి విసృ్తతంగా పర్యటిస్తున్నారు. ఇక, ప్రభుత్వ అధికారిక కార్యక్రమం రచ్చబండలో ఏ కార్యక్రమాన్నీ విడిచిపెట్టకుండా హాజరయ్యారు. ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో అక్కడి నేతలతో కలిసి వేదికలను పంచుకున్నారు. ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్రెడ్డితోనూ సర్దుబాటు చేసుకున్నట్లే కనిపించింది. ఒకవిధంగా తనకు వ్యతిరేక వర్గం లేకుండా అందరితో కలిసిపోవడం, అందరినీ కలుపుకొనిపోవడం అన్న వ్యూహంతో ఎంపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితులను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న కారణంగానే.. హైదరబాద్లో సీఎల్పీ వేదికగా తన తనయుడి టికెట్ గురించి మాట్లాడి మీడియాలో ప్రచారం పొందాలని, రాష్ట్ర నాయకత్వానికి తన కోరికను ఇలా వెల్లడించేందుకు దామోదర్రెడ్డి ప్రయత్నించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘ఒక నాయకుడు కొడుకు కోసం, మరో నాయకుడు భార్య కోసం, ఇంకో నాయకుడు కోడలు కోసం... ఇలా అందరూ తమ కుటుంబ సభ్యులకు టికెట్లు అడుగుతున్నారు. ఇది అధికా రం కోసమే కానీ, ప్రజాసేవ కోసం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు...’ అంటూ రాజగోపాల్రెడ్డి తీవ్రంగానే వ్యాఖ్యానించారు.
వైపు తమ సొంత ఎంపీకి వ్యతిరేకంగా ఇలా కుట్రలు చేయడం ఏమిటి..? ఇది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకోవాల్సిన సీట్లపై ప్రభావం చూపదా..? అన్న చర్చా జరుగుతోంది. భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో రాజగోపాల్రెడ్డికి వ్యతిరేకంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి తెరవెనుక తతంగం నడిపారని, అధికారుల పోస్టింగులు మొదలు, వివిధ అభివృద్ధి పనులకు నిధులు రాకుండా అడ్డుపడ్డారనీ చెబుతున్నారు.
‘తెలంగాణ కోసం నిత్యం సొంత పార్టీపై, మరీ ముఖ్యంగా సీఎంపై విరుచుకుపడుతున్న కోమటిరెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సీఎం కూడా పావులు కదిపారు. కొందరని దగ్గరకు తీసి చెప్పిందల్లా చేశారు. ఆ రకంగా ఎంపీపై పార్టీ అధిష్టానం వద్ద వ్యతిరేకతను పెంచే ప్రయత్నా లు చేశారు. అయినా, అధినాయకత్వానికి అన్నీ తెలుసు..’ అని పార్టీ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టికెట్లు ఖరరాయ్యే దాకా కాంగ్రెస్లో గుంపుల లొల్లి సమ సేలా కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భువనగిరి ఎంపీ స్థానంపై అందరికీ ఆశ
Published Fri, Nov 29 2013 3:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
What’s your opinion
Advertisement