కత్తులతో బెదిరించి బైక్‌తో జంప్ | Sakshi
Sakshi News home page

కత్తులతో బెదిరించి బైక్‌తో జంప్

Published Mon, Sep 14 2015 10:30 AM

bike robbery in nellore distirict

గూడూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తిని కత్తులతో బెదిరించి బైక్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలోని గూడూరు రూరల్ మండలంలోని పెంబలేరు వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళుతున్న సందీప్ అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి అడ్డగించారు. అనంతరం కత్తులతో బెదిరించి బైక్, సెల్‌ఫోన్, నగదను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
Advertisement