విజయవాడ సిటీ : బైక్ చోరీలు చేస్తూ జల్సా చేస్తున్న దంపతుల గుట్టును సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. కొట్టేసిన బైకులను ఆన్లైన్లో పెట్టి అమ్మి సొమ్ము చేసుకుంటున్న వీరిని అరెస్టు చేసి 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఎల్.కాళిదాస్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చిట్టినగర్లోని సాయిరామ్ థియేటర్ ప్రాంతానికి చెందిన చెన్నా సాగర్ (25) ఇటీవల స్వర్ణలతను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి తరచూ స్టార్ హోటళ్లకు వెళ్లి జల్సా చేసేవారు.
ఇందుకు అవసరమైన డబ్బు కోసం స్వర్ణలత భర్తను బైక్ దొంగతనాలకు పురిగొల్పింది. ఆపై తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో నకిలీ పత్రాలు తయారు చేసి ఆన్లైన్లో బైక్లు అమ్మేవారు. తాళం వేయని బైక్లు, బైక్లోనే వాహనం అసలు పత్రాలు ఉన్నవాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇద్దరూ కలిసి సరదాగా తిరుగుతూ చోరీ చేయాల్సిన బైక్ను ఎంచుకునేవాళ్లు. ఆపై ఆ బైక్ను చోరీ చేసి భర్త వస్తుంటే, అక్కడికి తాము వెళ్లిన బైక్ను స్వర్ణలత నడుపుకుంటూ వచ్చేది. ఇప్పటివరకు విజయవాడలో 12, గుంటూరులో 2, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున మోటార్ సైకిళ్లు చోరీ చేశారు.
అమ్మకం ఇలా...
చోరీ చేసిన మోటారు సైకిళ్లకు కంప్యూటర్ ద్వారా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. ఆపై కొత్త సిమ్ కార్డును తీసుకుని ఉపయోగిస్తారు. ఆ సిమ్ ద్వారా ఓఎల్ఎక్స్ లాంటి ఆన్లైన్ షాపింగ్లో అమ్మకానికి పెడతారు. అందులోనే మోటారు సైకిల్ కండిషన్, రేటును కూడా పేర్కొంటారు. ఎవరైనా వీటిని కొనుగోలు చేసిన తర్వాత మరుసటి రోజు వాహనం రిజిస్ట్రేషన్కు ఆర్టీఏ కార్యాలయానికి వస్తానని చెబుతారు. అంతే ఆపై ఆ మొబైల్ ఫోన్ పనిచేయదు. చేసేది లేక కొనుగోలు చేసిన వాహనాలను వినియోగదారులు అలాగే వినియోగిస్తుంటారు.
ఇలా చిక్కారు..
తాను మోటారు సైకిల్ కొనుగోలు చేసిన మరుసటి రోజునే రిజిస్ట్రేషన్కు వస్తానని చెప్పిన వ్యక్తి సిమ్ కార్డు పని చేయడం లేదని గుర్తించిన ఓ బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగంలోకి దిగి సిమ్ కార్డు ఆధారంగా కూపీ లాగితే దంపతుల బండారం బయటపడింది. అరెస్టు చేసిన నిందితుల నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
దోచేయ్.. జల్సా చెయ్!
Published Fri, Dec 25 2015 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement