పుట్టిన బిడ్డ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ కన్నతల్లికి ఆస్పత్రి సిబ్బంది చల్లగా చావు కబురు అందించారు. దీంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. నాకు పుట్టింది ఆడ బిడ్డా?మగ బిడ్డా? అని ఆత్రంగా అడిగిన ఆ తల్లికి నీ బిడ్డ ఉమ్మ నీరు తాగి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో భోరుమంది. నవమోసాలు మోసి అమ్మా.. అని పిలుపు కోసం ఎదురు చూసిన తల్లికి పుట్టెడు కష్టం వచ్చి పడింది. దీనిని భరించలేని బాలింత బంధువులు తమ బాబును తమకు అప్పగించాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు తన పేగు బంధం నిజంగానే తెగిందా.. వైద్యులే తెంచేశారా? అంటూ ఆ తల్లి రోదన అందరినీ కంటతడి పెట్టించింది. శ్రీకాకుళం పట్టణంలోని ఓ మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళ్తే...
శ్రీకాకుళం సిటీ : బిహార్కు చెందిన సంజయ్సాహు, రీనాదేవి దంపతులు. వీరికి ఐదేళ్ల కాజల్, మూడేళ్ల మస్కాన్ ఉన్నారు. పట్టణంలో కలెక్టర్ బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న ఈ దంపతులు మూడో కాన్పు కోసం పట్టణంలోని కమల ఆస్పత్రిలో వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ నెల 12న రీనాదేవి ప్రసవం నిమిత్తం ఇలిసిపురం వద్ద ఉన్న కమల ఆస్పత్రి(మల్టీ స్పెషాల్టీ)లో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమెకు గైనకాలజిస్ట్ శాంతిలత శస్త్రచికిత్స చేశారు. బిడ్డ పరిస్థితి ఆరోగ్యకరంగా లేనందున చికిత్స చేస్తున్నామని చెప్పి అప్పటి నుంచి బుధవారం వరకు పిల్లాడిని తల్లికి చూపించని వైద్యులు మృతి చెందాడని తరువాత చెప్పడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వైద్యుల తీరుపై ధ్వజమెత్తారు. తమ బిడ్డను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్ద పరిస్థితిని చక్కదిద్దారు. గైనకాలజిస్ట్ శాంతిలత బుధవారం విధులకు హాజరు కాకపోవడంతో కమల ఆస్పత్రి ఎండీ రామకృష్ణ బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు.
బాబును అప్పగించాలి...
నాకు రెండుసార్లు సాధారణ ప్రసవం జరిగింది. మూడోసారి ఆపరేషన్ గదిలో తనకు సాధారణ ప్రసవం జరుగుతుండగా బిడ్డ తలపై వైద్యులు నొక్కిపెట్టి బిడ్డ బయటకు రాకుండా శస్త్రచికిత్సను చేశారు. సిజేరియన్ జరిగిన తర్వాత బాబు పుట్టినట్లుగా తనకు వైద్యులు చెప్పారు. ఇప్పుడు పాప పుట్టిందని, ఉమ్మ నీరు తాగడం వల్ల చనిపోయిందని తమతో వాదిస్తున్నారు.
- రీనాదేవి, తల్లి
పేగు బంధం తెగిందా..తెంచేశారా?
Published Thu, Jan 21 2016 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
Advertisement