తెలంగాణ వ్యతిరేకులతో కలిసే ప్రసక్తే లేదు: నాగం | Sakshi
Sakshi News home page

తెలంగాణ వ్యతిరేకులతో కలిసే ప్రసక్తే లేదు: నాగం

Published Sun, Nov 24 2013 12:06 AM

bjp would never alliance with Opposed parties of telangana, says nagam janardhan reddy

సాక్షి, నిజామాబాద్: తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు.  నిజామాబాద్‌లో శనివారం జరిగి న ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో నాగం ప్రసంగించారు. బీజీపీ మద్దతు లేనిదే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయ్యే అవకాశాలు లేవన్నారు. సోనియా పంపిన సీల్డ్ కవర్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు సమైక్యాంధ్ర విషయంలో అధిష్టానాన్నే ఎదిరిస్తున్నాడని విమర్శించారు.  కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పదోవ పట్టిస్తూ రాష్ట్రంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్న సీఎం కిరణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాగం డిమాండ్ చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement