మచిలీపట్నం, న్యూస్లైన్ : సాధారణ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి... అక్కడున్న సామాజికవర్గాలు ఎవరివైపు మొగ్గు చూపాయి... తదితర అంశాలపై లెక్కలు వేసుకుంటున్నారు.
బందరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ, టీడీపీల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ నాయకులు బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసినప్పటికీ గెలుపు ఎవర్ని వరిస్తుందనే అంశంపై అభ్యర్థులు, వారి అనుచరులు ఆరా తీస్తున్నారు. బందరు నియోజకవర్గంతో పాటు జిల్లాలో వైఎస్సార్ సీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా... ఎన్ని సీట్లు వస్తాయి... టీడీపీ ఎన్ని సీట్లతో సరిపెట్టుకుంటుందనే అంశాలపైనా పలువుర్ని అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రశాంతంగా ఎన్నికలు
బందరు నియోజకవర్గంలో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నాపురం, ఉల్లింగిపాలెం, వాడపాలెం, సుల్తానగరం తదితర ప్రాంతాల్లో మిలటరీ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎలాంటి అల్లర్లు లేకుండా కట్టడి చేశారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ తీరును తెలుసుకునేందుకు వెబ్ కెమేరాల సహాయంతో తెరను ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని ప్రజలు తిలకించేందుకు వీలు కల్పించారు.
ఓటింగ్పై ఎవరిలెక్కలు వారివే..!
Published Thu, May 8 2014 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement