డెంగ్యూతో బాలుడు మృతి | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో బాలుడు మృతి

Published Sun, Sep 13 2015 11:44 AM

Boy dies of dengue

మదనపల్లె (చిత్తూరు జిల్లా) : వారం రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న బాలుడు ఆదివారం వేకువజామున మృతిచెందాడు. వివరాల ప్రకారం.. మదనపల్లె మండలం నాయునిచెరువు ఒడ్డిపల్లికి చెందిన మునెప్ప, సుగుణ దంపతుల కుమారుడు అనిల్‌ కుమార్ నాలుగవ తరగతి చదువుతున్నాడు. అయితే గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృత్యువాతపడ్డాడు.

Advertisement
Advertisement