నిరసనగా తరగతుల బహిష్కరణ
పాలిటెక్నిక్ విద్యార్థుల ఇంటిబాట
మంత్రి వస్తేనే కళాశాలకు వస్తామని స్పష్టీకరణ
తమ సమస్యలు పరిష్కరించాలంటూ నర్సీపట్నం పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ నెల 6న ఆందోళన చేపట్టారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మొర పెట్టుకున్నారు. ఈమేరకు కళాశాలకు వస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన కళాశాలకు వస్తారని, సమస్యలు చెప్పుకుందామని విద్యార్థులు ఆశగా ఎదురు చూశారు. మంత్రి మాటతప్పడంతో విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఇంటి ముఖం పట్టారు. మంత్రి వస్తేనే కళాశాలకు మళ్లీ వస్తామని స్పష్టం చేశారు.
నర్సీపట్నం: తమ సమస్యలు పరిష్కరించాలని పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో సోమవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఇంటి ముఖం పట్టారు. తాగునీరు, మరుగు సౌకర్యం కల్పించాలని ఈ నెల 6న పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు మీద బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేశారు. అంతటితో ఆగకుండా ర్యాలీగా వెళ్లి మంత్రి అయ్యన్నపాత్రుడిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం మీ కళాశాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించిన విషయం తెలిసిందే. మంత్రి అయ్యన్న సోమవారం తమ కళాశాలకు వస్తే సమస్యలు చెప్పుకుందామని విద్యార్థులు ఆశగా ఎదురు చూశారు. మంత్రి రాకపోవడంతో విద్యార్థులు బ్యాగ్లు సర్దుకుని ఇంటి బాట పట్టారు.పాడైన తాగునీటి కూలర్ను వినియోగంలో తీసుకురాకుండా, కూలర్ ప్రదేశంలో ట్యాప్లు ఏర్పాటు చేశారు. ట్యాప్లు ఏర్పాటు చేసినా తాగేందుకు నీరు పనికిరాదని విద్యార్థులు చెబుతున్నారు. మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించకుండా శుభ్రం మాత్రమే చేశారని. రన్నింగ్ వాటర్ లేకపోతే టాయిలెట్స్ ఎలా వినియోగించగలమని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ముందు పడి ఉన్న చెట్లు, చెత్తా చెదారాన్ని తొలగించారు తప్ప సౌకర్యాలు మెరుగుపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ల్యాబ్లు, ప్రొజెక్టర్లు, అధ్యాపకుల కొరతతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని స్వయంగా మంత్రికి చూపిద్దామనుకున్నాం. విద్యా పరంగా నర్సీపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకునే అయ్యన్న ఇలాకాలోని కళాశాలలో మౌలిక వసతులు లేకపోతే ఎలా చదవగలమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 700 మంది విద్యార్థులం వెళ్లి మొర పెట్టుకున్నప్పటికీ మంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఎంత నచ్చచెప్పినా విద్యార్థులు వినలేదు. మంత్రి అయ్యన్న తమ కళాశాలకు ఎప్పుడు వస్తే అప్పుడే తాము వస్తామని విద్యార్థులు తరగతులు బహిష్కరించి వెళ్లిపోయారు.
మాట తప్పిన అయ్యన్న
Published Tue, Feb 10 2015 12:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement