సాక్షి ప్రతినిధి, గుంటూరు: నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోని గుంటూరు చానల్ ఆధునికీకరణకు ప్రభుత్వం ఒక్కసారిగా రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నది. దాదాపు 45 సంవత్సరాల నుంచి కాలువకు ఎలాంటి మరమ్మతులు చేయని సాగునీటి శాఖ యుద్ధప్రాతిపదికన అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ కాలువకు మరమ్మతులు చేయాలని రైతులు అనేకసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోని ఇరిగేషన్ శాఖ ఆకస్మికంగా ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటోంది.
విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటైతే తాగునీటి సమస్య తలెత్తకూడదని, కాలువ ఆయకట్టు పరిధిలోని 27 వేల ఎకరాలకు సాగునీటి సమస్య లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఆధునికీకరణకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.1967లో ప్రారంభించిన ఈ చానల్ నిర్మాణం 1972లో పూర్తయింది.
పాకలపాడు రెగ్యులేటర్ నుంచి వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు రూరల్, చేబ్రోలు మండలాల పరిధిలోని పంట పొలాలకు సాగునీటిని సరఫరా చేయడమే కాకుండా తాడేపల్లి, మంగళ గిరి, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి సరఫరాకు ఈ కాలువను నిర్మించారు.
నిర్మాణం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఏడాది పొడవునా కాలువకు నీటి సరఫరా జరుగుతుండటంతో మరమ్మతులకు అవకాశమే లేకుండా పోయింది. కాలువకు నీటి సరఫరా నిలిపి వేస్తే తాడేపల్లి, మంగళగిరితోపాటు గుంటూరు నగర ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వుంటుంది.
కాలువ ఆయకట్టు పరిధిలో 32 సమ్మర్ స్టోరేజి ట్యాంకుల ద్వారా 27 గ్రామాలకు రక్షిత మంచి నీటి సరఫరా జరుగుతోంది. సాగునీటి సరఫరాకు ఆటంకంగా నిలిచిన తూడు, గుర్రపు డెక్క నిర్మూలనకు మాత్రమే అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారు. నీటి సరఫరాకు నిర్మితమైన కట్టడాలు పూర్తిగాశిథిలమయ్యాయి. అంతేకాక, రూ.440 కోట్లతో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
కాలువను ఆధునీకరించినప్పుడే వీటిన్నింటికీ నీటి సరఫరా చేసే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు అంచనాలు తయారు చేశారు.నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ కాలువ ఆధునికీకరణకు రూ.122 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేయగా, కొత్త ఎస్ఎస్ఆర్ ప్రకారం రూ.300 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనా చేశారు.
47 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ కాలువకు సిమెంట్తో లైనింగ్ చేయడమే కాకుండా రిటైనింగ్ వాల్స్ను ఇరువైపులా నిర్మించనున్నారు. నల్లరేగడి నేలతో కూడిన కాలువ గట్లు తరచూ జారిపోయే ప్రమాదం ఉండటంతో రిటైనింగ్ వాల్స్ నిర్మించనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టెండర్ల స్వీకరణకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్
Published Wed, Aug 6 2014 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement