లారీ,ఆటో ఢీ: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

లారీ,ఆటో ఢీ: ఇద్దరి మృతి

Published Sat, Feb 27 2016 7:45 AM

bride died killed in a road accident

తిరుపతి: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు సహా మరొకరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం ఉదయం ఐరాల మండలం బొబ్బాయివారిపల్లె వద్ద చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement