200 పడకల ఆస్పత్రిగా మార్చాలి: సీపీఐ | Sakshi
Sakshi News home page

200 పడకల ఆస్పత్రిగా మార్చాలి: సీపీఐ

Published Thu, Aug 6 2015 3:37 PM

bring up 200 beds facility in hospital, says CPI

పార్వతీపురం (విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా మార్చాలని కోరుతూ సీపీఐ ధర్నాకు దిగింది. గురువారం ఆస్పత్రి ఎదుట జరుగుతున్న ధర్నాలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆస్పత్రి చైర్మన్‌గా ఉన్న టీడీపీ నాయకుడు ఆస్పత్రి బాగోగులు పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement