- పంటకు అంతుచిక్కని తెగుళ్లు
- ఈ ఏడాది అనుకూలించని వాతావరణం
- కోసిన కాయల్లో సింహభాగం పుచ్చులే..
- క్రిమిసంహారకాలు వాడినా ఫలితం శూన్యం
- సాగుకు సూచనలిచ్చే నాథులే లేరు
- జాడలేని ఉద్యానశాఖ అధికారులు
- కష్టానికి దక్కని ఫలితం..
- అప్పుల ఊబిలో రైతులు
పిట్టలవానిపాలెం, న్యూస్లైన్ : తాజా కూరల్లో రాజా ఎవరంటే... ఠక్కున చెప్పే సమాధానం వంకాయ అని. గుత్తి వంకాయ పేరు వింటే నోరూరని వారుండరు.. ఆ కూర చూస్తేనే లొట్టలేస్తుంటాం.. ఆస్వాదిస్తూ తింటాం.. అంతటి రుచిగల వంగ.. సాగుచేసే రైతుకు మాత్రం కష్టనష్టాల్నే మిగుల్చుతోంది. గుత్తి వంకాయ రకం సాగుకు బాపట్ల ప్రాంతానికి రాష్ర్టంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇక్కడ పండించే పంట బాపట్ల వంకాయగా పేరెన్నిక గన్నది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పోవడంతో తెగుళ్లు అధికమయ్యాయి. ఎన్ని క్రిమిసంహారక మందులు వాడినా తెగుళ్ల ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. రైతు కష్టానికి ఫలితం దక్కడం లేదు. దిగుబడిలో 90 శాతానికిపైగా పుచ్చులే కావడంతో రైతుకు నష్టాలే ఎదురవుతున్నాయి.
50 కిలోల బరువుండే టిక్కీ వంకాయల్లో 10 కిలోలకు మించి పుచ్చుల్లేనివి దొరకడం లేదంటే నష్ట తీవ్రత ఏమేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలోని గరువు నేలల్లో రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో వంగతోటలు విస్తారంగా సాగు చేస్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా మొక్కలను ఆశిస్తున్న అంతుచిక్కని తెగుళ్లు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడి తోటల్లో ప్రధానంగా కొమ్మ తెగులు, వెర్రితల తెగులు, కాయపుచ్చు, చె ట్లు ఎండిపోవడంలాంటి తెగుళ్లు కనిపిస్తున్నాయి.
కాయపుచ్చు విషయంలో ఎకరం తోటలో 20 టిక్కీల వంకాయలు తెగితే అందులో 10 కిలోలు కూడా మంచి కాయలు దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అందిన చోటల్లా అప్పులు చేసి సాగుకు, పురుగుమందులు తదితరాల కోసం ఎకరానికి రూ.లక్షకు పైగా ఖర్చుచేశామని, కనీసం పెట్టుబడి కూడా దక్కక నష్టాలొస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.
దుకాణదారుల సూచనలే.. తోటల్లో సస్యరక్షణ, ఎరువుల వాడకం, నీటి యాజమాన్యానికి సంబంధించి సలహాలు సూచనలు అందించాల్సిన ఉద్యాన శాఖాధికారులు అసలు ఉన్నారో లే రో తెలియని పరిస్థితి. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తే కూరగాయల సాగు తమకు సంబధించినది కాదని సమాధానమిస్తున్నారు.
దీంతో రైతులు చేసేది లేక తమ అనుభవం ఆధారంగా స్థానికంగా ఎరువులు, పురుగుమందుల దుకాణ దారులు ఇచ్చే సలహాల మేరకు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం దక్కడం లేదు. ఈ విషయంపై పొన్నూరు ఉద్యానవన శాఖాధికారి డి.కల్యాణిని న్యూస్లైన్ వివరణ కోరగా వంగతోటలను పరిశీలించి అవసరమైన మేరకు సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు.
వంగ రైతు బెంగ!
Published Sat, Apr 26 2014 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement