రాయికల్, న్యూస్లైన్: జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగిపోతోంది. కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో తరిమితరిమి నరికిచంపుతున్న ఘటనలు ఇటీవల బాగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట వీణవంక మండలం నర్సింగాపూర్లో మాజీ ఎంపీటీసీని వేటకొడవళ్లతో నరికి చంపిన ఘటన మరువకముందే ఇప్పుడు రాయికల్ మండలం కిష్టంపేటలోనూ అలాంటి ఘటనే జరిగింది.
కిష్టంపేటకు చెందిన కచ్చకాయల మోహన్(35)ను మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. మోహన్ ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగివస్తుండగా గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఓ మామిడితోటలో గుర్తుతెలియని వ్యక్తులు కాపుకాసి అడ్డుకున్నారు.
తమ వెంట తెచ్చుకున్న కారంపొడి అతడి కళ్లలో చల్లి వేటకొడవళ్లతో దారుణంగా నరికారు. తల, ముఖంపై, కడుపులో విచక్షణా రహితంగా పొడిచారు. ఓ కత్తిని అతడి పొట్టలోనే వదిలేశారు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ పరమేశ్వర్రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ వెంకటరమణ, రాయికల్ ఎస్సై రామూనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు భూతగాదాలు, పాతకక్షలే కారణమని భావిస్తున్నారు.
సంఘటన స్థలంలో దుండగులు ఏపీ 15 క్యూ 3473 నంబర్ గల ద్విచక్రవాహనం వదిలివెళ్లారు. ఈ వాహనం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా మృతుడి భార్య వసంత అడ్డుకుంది. తనకు గ్రామంలోని పది మందిపై అనుమానం ఉందని, తన భర్తను వారే పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ... అనుమానితుల పేర్లను ఎస్సైకి వివరించింది.
వారిని వెంటనే శిక్షించాలని, అప్పటివరకు తన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లొద్దంటూ అడ్డుకుంది. దోషులను పట్టుకుంటామని, న్యాయం చేస్తామని సీఐ నచ్చజెప్పడంతో ఆమె ఆందోళన విరమించింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మోహన్కు భార్య వసంత, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మాజీ మంత్రి జీవన్రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కాగా, మృతుడికి కొందరితో భూ తగాదాలు ఉన్నాయని, ఓ హత్యకేసులో జైలుకెళ్లి వచ్చాడని స్థానికులు తెలిపారు.
కిష్టంపేటలో దారుణహత్య
Published Wed, Feb 5 2014 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
పెరుగుతున్న క్యాష్ విత్డ్రాలు!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
Advertisement