డోన్ : అర్టీసీ అధికారులు.. వ్యాపారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏకంగా మూడేళ్ల పాటు ఎలాంటి అద్దెలు లేకుండా ప్యాపిలి బస్టాండ్లో దుకాణాలను కేటాయించారు. ఇదే అదునుగా చేసుకొని మరి కొందరు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మూడేళ్లుగా సుమారు రూ.5 లక్షల వరకు ఆర్టీసీ నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్యాపిలి బస్టాండులో 15 దుకాణాలు ఉన్నాయి. ఇందులో బస్టాండ్లో ఉన్న రెండు దుకాణాలతోపాటు 14, 12, 10వ నంబర్ల షాపులు అద్దెలు చెల్లిస్తున్నాయి. ఇక మిగిలిన తొమ్మిది దుకాణాలు బస్టాండుకు ఎదురుగా ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డు ముఖానికి ఉన్నాయని, వ్యాపారాలు జరగడం లేదని తాము అద్దెలు చెల్లించలేమని వ్యాపారులు చెప్పడంతో ఆర్టీసీ అధికారులు గుడ్డిగా తల ఊపారు.
అనధికార షాపులకు అధికారుల అండ:
టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిలో ప్యాపిలికి చెందిన వెంకటేశ్వర్లకు 0.65 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ 18.07.2013న ఆదేశాలుజారీ చేశారు. అదే విధంగా వెంకటరమణకు, తిమ్మారెడ్డి అనే వ్యక్తికి కూడా దుకాణాలు కేటాయించారు. వీరు తమ సొంత ఆదాయం కోసం కేటాయించిన స్థలంలోనే మరిన్ని షాపులను నిర్మించి సబ్లీజుదారులకు ఇచ్చారు. నిబంధనలకు మేరకు సబ్లీజ్ ఇవ్వడం సరికాదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో 02.06.14వ తేదీన లెసైన్సు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా వెంకటరమణ, తిమ్మారెడ్డికి చెందిన షాపులను కూడా రద్దు చేశారు.
దీంతో తమకు అన్యాయం జరిగిందని ఆయా దుకాణదారులు కోర్టును ఆశ్రయించడంతో వాటినన్నంటినీ సీజ్ చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అనధికార షాపులను నడుపుతున్నారు. వీటి నిర్వాహకులకు డోన్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అండ ఉన్నట్లు తెలుస్తోంది. సదరు ఉద్యోగి తన భార్యను పోస్టల్ ఆర్డీ ఏజెంటుగా నియమించుకొని.. వ్యాపారుల వద్ద నుంచి వేలకువేల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగి ప్యాపిలి బస్టాండులో బినామీ పేరుతో ఒక దుకాణాన్ని దక్కించుకొని సబ్లీజుకు ఇచ్చాడు. ఆ దుకాణం లెసైన్సు రద్దు అయినప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక డిపో మేనేజర్ జయచంద్రను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
బంపర్ ఆఫర్..!
Published Wed, Aug 5 2015 3:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement