క్రైం (కడప అర్బన్), పులివెందుల : పులివెందులకు చెందిన కర్ణ సతీష్కుమార్రెడ్డి(36) అనే వ్యాపారి మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. కడప నగరంలోని మద్రాసు రోడ్డులో శుక్రవారం రెండు ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో ఉన్న కారులో అతడి మృతదేహం
లభించింది. మృతుడి బంధువుల కథనం మేరకు.. లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన కర్ణ సతీష్కుమార్రెడ్డి పులివెందులలో ఉంటూ పెట్రోలు బంకు, వాటర్ ప్లాంట్లను నడిపేవాడు.
కొంతకాలంగా అప్పుల పాలవడం, వివాహేతర సంబంధాలు ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురై పులివెందులలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తుండేవాడు. తనకు కడపలో పని ఉందని ఈనెల 13న పెట్రోలు బంకు యజమాని, సమీప బంధువు హరనాథరెడ్డికి చెందిన ఇండికా విస్టా (కేఏ37 ఎం4758) కారును తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి రాకపోవడంతో ఈనెల 16న అతని సోదరుడు ప్రసాద్రెడ్డి, బంధువులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారిస్తున్న సమయంలోనే శుక్రవారం సాయంత్రం కడపలో అతని మృతదేహం లభ్యమైంది.
ఇది టీడీపీ నేత పనే!
కడప నగరానికి చెందిన టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్పై సతీష్కుమార్రెడ్డి బంధువులు ఆరోపణలు చేశారు. అతని దగ్గర సతీష్కుమార్రెడ్డికి డబ్బులు ఇచ్చిన వ్యక్తుల పంచాయతీ జరిగిందని, అతని అనుచరులు రెండు రోజుల క్రితం కడప నగరంలోని గోకుల్ సర్కిల్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో భోజనం చేస్తున్న సతీష్కుమార్రెడ్డిని కిడ్నాప్ చేశారని చెప్పారు. దారుణంగా కొట్టిన చిత్రం వాట్సాప్ ద్వారా తమకందిందని సతీష్కుమార్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డి సెల్ఫోన్ ద్వారా మీడియాకు చూపారు. మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నాయని చెప్పారు.
స్థానికుల సమాచారం మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్కుమార్, చిన్నచౌకు సీఐ యుగంధర్బాబు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించారు. అంతలోనే పులివెందుల నుంచి సతీష్కుమార్రెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డి, బంధువులు మధుసూదన్రెడ్డి, నాగార్జునరెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఈజీ అశోక్కుమార్ మీడియా కు తెలిపారు. కాగా, సతీష్కుమార్రెడ్డి మృతి తో పులివెందులలోని నగురిగుట్ట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య సంజీవమ్మ, కుమారుడు యోగవర్ధన్రెడ్డి, కుమార్తె నిఖిత బోరున విలపించారు.
వ్యాపారి కిడ్నాప్.. దారుణ హత్య
Published Sat, Apr 18 2015 1:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement