విభజనపై ఓటింగ్ నిర్వహించాలి: భూమా | Sakshi
Sakshi News home page

విభజనపై ఓటింగ్ నిర్వహించాలి: భూమా

Published Tue, Aug 6 2013 3:48 AM

By public voting will know people favour of State bifurcation: says Bhumana

నంద్యాల, న్యూస్‌లైన్: సమైక్యం, రాష్ట్ర విభజనలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో రాజధాని హైదరాబాద్‌లోనే బహిరంగ ఓటింగ్ నిర్వహిస్తే తేలిపోతుందని వైఎస్‌ఆర్ కాంగెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతకు కృషి చేసిన ఇందిర, ఎన్టీఆర్, పొట్ట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిం చేలా సోనియా, చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో వీరు భారీమూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించడంతోనే వైఎస్సార్ సీపీకి సీమాంధ్రలో ఎంతబలం ఉందో..తెలంగాణలోనే అంతే ఆదరణ లభిస్తోందన్నారు.

Advertisement
Advertisement