జూపాడుబంగ్లా: నిరుద్యోగుల ఆశలను కొందరు యువకులు సొమ్ము చేసుకున్నారు. కం పెనీ ఉద్యోగాలని.. లక్షల్లో జీతాలని నమ్మబలికి ఏకంగా 600 మందిని బురిడీ కొట్టించారు. చదువుతో పనిలేదని.. వయసుతో నిమిత్తం లేదంటూ ఒక్కొక్కరి నుంచి రూ.8వేలు చొప్పున వసూలు చేశారు. శిక్షణ పేరిట మరో రూ.8వేలు గుంజారు. సుదూర రాష్ట్రాల్లో రెండు మూడు నెలలు నిర్బంధించి నరకం చూపారు.
తాము మోసపోయామని తెలుసుకుని అక్కడి నుంచి బయటపడిన బాధితులు కొందరు శనివారం జూపాడుబంగ్లా ఎస్ఐ గోపినాథ్ ఎదుట తమ గోడు వినిపించారు. వివరాల్లోకి వెళితే.. జలకనూరు గ్రామానికి చెందిన పాణ్యం వేణుగోపాల్, షేక్అహమ్మద్ బాషా, హబీవుల్లా, చాంద్ అనే యువకులు తాము గ్లాజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నామని జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల్లో స్నేహితుల ద్వారా నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నారు.
రూ.8వేలు చెల్లిస్తే తమ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో జూపాడుబంగ్లా మండలంలోని తరిగోపుల, 80.బన్నూరు గ్రామాలతో పాటు పాములపాడు మండలంలోని చెలిమిల్ల, లింగ ాల, కొత్తబానకచర్ల, మిడ్తూరు మండలంలోని జలకనూరు, గూడూరు తదితర గ్రామాలకు చెందిన సుమారు 600 మంది వారి మాయలో పడ్డారు. ఒక్కొక్కరి నుంచి రూ.16వేలు చొప్పున దాదాపు రూ.కోటి వసూలు చేశారు. నమ్మించేందుకు కొందరికి గుర్తింపు కార్డులను సైతం ఇచ్చేశారు.
గత మార్చిలో కొందరు యువకులను శిక్షణ నిమిత్తం ఉత్తరప్రదేశ్లోని కాశీ వద్దనున్న గాజ్పూర్లో రెండు నెలలు, బీహార్లో రెండు నెలలు నిర్బంధిం చారు. చివరకు తాము మోసపోయామని తెలుసుకున్న యువకులు తల్లిదండ్రుల ద్వారా బ్యాంకుల్లో నగదు వేయించుకుని ఇంటికి తిరుగుపయనమయ్యారు. అయితే గూడూరుకు చెందిన శివ అనే వ్యక్తి శిక్షణ నిమిత్తం ఉత్తరప్రదేశ్కు వెళ్లి ఇప్పటికీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గత రెండు రోజులుగా బాధితులు జూపాడుబంగ్లా ఎస్ఐ గోపినాథ్ను కలిసి తమ గోడు వినిపిస్తున్నారు. శనివారం కొత్తబానకచర్లకు చెందిన నాగభూషణం, లింగాలకు చెందిన చిన్నకొలమయ్య, అశోక్లు ఎస్ఐని కలిసి మోసపోయిన తీరును వివరించారు. అనంతరం ఎస్ఐ విలేకరులతో మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.
ఇప్పటికే షేక్అహమ్మద్ బాషా, హబీవుల్లా, చాంద్లను అదుపులోకి తీసుకోగా.. వేణుగోపాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. అదుపులోని ముగ్గురు యువకులు తాము కూడా మోసపోయామని చెబుతున్నారని.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూరుస్తామన్నారు.
చదువక్కర్లేదు.. వయసుతో పన్లేదు!
Published Sun, Nov 30 2014 3:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement