తల్లి ఊపిరి తీసిన క్యాన్సర్ | Sakshi
Sakshi News home page

తల్లి ఊపిరి తీసిన క్యాన్సర్

Published Fri, Aug 30 2013 3:06 AM

cancer kills mother

 బెల్లంపల్లి రూరల్, న్యూస్‌లైన్ : మాలగురిజాలకుచెందిన గొమాస బాపు, చిన్నమ్మ దంపతు ల చిన్నకూతురు విజయ(25) వివాహం తాం డూర్ మండలం తంగెళ్లపల్లికి చెందిన లారీ క్లీన ర్ రమేశ్‌తో 2011లో జరిగింది. ఏడాది క్రితం విజయ గర్భం దాల్చడంతో వైద్యపరీక్షలు చే రుుంచారు. ఇందులో ఆమెకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆందోళన చెందిన ఇరు కుటుంబాల సభ్యులు ఆమెకు హైదరాబాద్, వరంగల్ ఆ స్పత్రుల్లో చికిత్స చేరుుస్తున్నారు. అరుునా వ్యాధి నయంకాలేదు.
 
  ఈ క్రమంలో మూడు నెలల క్రితం విజయ మగబిడ్డకు జన్మనిచ్చిం ది. ఆమెకు క్యాన్సర్ వ్యాధి ఉండడంతో వైద్యు ల సలహా మేరకు బాబుకు బయటి పాలు పడుతున్నారు. అతడికి నామకరణమూ చేయలేదు. ఈ నేపథ్యంలో వ్యాధి తీవ్రతకు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విజయ చనిపోరుుంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు విషాదంలో మునిగిపోయూరు. అం త్యక్రియలు మర్నాడు నిర్వహించడానికి బం ధువులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యూరు. ఇంతలో నాలుగు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మూడు నెలల కొడుకు గురువారం వేకువజామున ఐదు గంటలకు మృతిచెందాడు. తల్లీకొడుకులు 12 గంటల వ్యవధిలోపే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  మధ్యాహ్నం తల్లీకొడుకుల దహన సంస్కారాలు వేర్వేరుగా నిర్వహించారు.
 
 

Advertisement
Advertisement