కొత్తకోట(రావికమతం,) న్యూస్లైన్: జిల్లాలో గంజాయిపై గురువారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. వేర్వేరుచోట్ల దాడులు, తనిఖీల్లో 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 9మందిని అరెస్టు చేశారు. కోత్తకోటలో అక్రమంగా తరలిస్తున్న రూ.6లక్షల విలువైన 60 కిలోల గంజాయిని రాత్రి గస్తీలో భాగంగా పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు.
ఆటోలో ముగ్గురు వ్యక్తులు గంజాయితో వస్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. అందు లో ఇద్దరు పారిపోయారు. ఆ ఆటోలో ఉన్న చెట్టుపల్లి గ్రామానికి చెందిన రాయికోటేశ్వరరావును పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ తిరుమలరావు తెలిపారు. తనిఖీల్లో కొత్తకోట, రావికమతం ఎస్ఐలు అశోక్కుమార్, విశ్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగురు అరెస్టు
పాడేరురూరల్: ముందస్తు సమాచారం మేరకు మాటువేసి రూ.లక్ష విలువైన 30 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు పెదబయలు నుంచి పాడేరు వైపు ఆటోలో గంజాయి తరలిస్తుండగా గంపరాయి గ్రామం వద్ద పట్టుకున్నామన్నారు. గంజాయి తరలిస్తున్న పెదబయలు మండలం బొండపల్లి గ్రామానికి చెందిన జంపరంగి శంకరరావు, పాడేరుకు చెందిన గొర్లె రాజేశ్వరరావు, విశాఖపట్నానికి చెందిన కసంగి సుఖ్దేవ్మన్బహుదుర్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. ఆటోను సీజ్ చేశామన్నారు. దాడుల్లో ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్(మొబైల్) ఎల్.ఉపేంద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
110 కిలోల గంజాయి స్వాధీనం
జి.మాడుగుల: ఎన్.కొత్తూరు నుంచి గంజాయి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని సీఐ కె.కృష్ణ తెలిపారు. 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్.కొత్తూరు గ్రామానికి చెందిన దేవినాయుడు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి గంజాయి తరలిస్తుండగా మత్స్యపురం జంక్షన్ వద్ద మాటువేసి పట్టుకున్నామన్నారు. బీరం గ్రామానికి చెందిన కె.సింహాచలం, వి.కృష్ణ, మత్స్యపురం గ్రామానికి చెందిన ఎం.సింహాచలంను అరెస్టు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సన్యాసినాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
90 కిలోలు స్వాధీనం
నర్సీపట్నం రూరల్: అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.3లక్షల విలువ గల 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ ఖలీమ్ గురువారం విలేకరులకు తెలిపారు. కమాండర్ జీపులో గంజాయిని తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు గొలుగొండ మండలం పోలవరం గ్రామ సమీపంలో మాటు వేసి పట్టుకున్నామన్నారు. జి.మాడుగుల మండలానికి చెందిన ఎం.అప్పారావు, వై.నారాయణను అదుపులోకి తీసుకోగా బుచ్చింపేట మండలానికి చెందిన ఉరబాల రాజు పరారయ్యాడన్నారు. రాజు కోసం గాలిస్తున్నామని తెలిపారు.
సత్యవరంలో గంజాయి పట్టివేత
మాడుగుల: ముందస్తు సమాచారంతో విశాఖ ఎన్ఫోర్స్మెంట్ సీఐ జైభీమ్, మాడుగుల ఎక్సైజ్ సీఐ ఇ.శ్రీనివాస్, సిబ్బంది కలిసి గురువారం గంజాయిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.లక్ష విలువైన 60 కిలోల సీలావతి రకానికి చెందిన గంజాయిని పట్టుకున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే నిందితుల ఆచూకీ తెలియకపోవడంతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
గంజాయిపై ఉక్కుపాదం
Published Fri, Sep 6 2013 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement