110 కిలోల గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

110 కిలోల గంజాయి పట్టివేత

Published Fri, May 30 2014 1:48 AM

110 కిలోల గంజాయి పట్టివేత - Sakshi

 మారేడుమిల్లి, న్యూస్‌లైన్ : మారేడుమిల్లి మీదుగా రవాణా అవుతున్న గంజాయిని పట్టుకున్న మారేడుమిల్లి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో నిఘా పెట్టి బుధవారం సాయంత్రం పొట్లవాడ కూడలి సమీపంలో టాటా మ్యాజిక్‌లో తరలిస్తున్న సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని మారేడుమిల్లి సీఐ మహ్మద్‌ఉమర్, ఎస్సై వి. కోటేశ్వర్రావు తెలిపారు.

వరంగల్ జిల్లా మర్రిపెడ మండలం టానంచర్లకి చెందిన తేజవోతు శంకర్, మహబూబాబాద్‌కు చెందిన గోపీ సుదర్శన్, అదే గ్రామానికి చెందిన గుత్తి యాదగిరి, దారకొండకు చెందిన శోభా సూర్యారావులను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. విశాఖ జిల్లా నేలజెట్ల అన్నవరం నుంచి ఈ గంజాయిని తరలిస్తున్నట్టు తెలిపారు. దీని విలువ సుమారు రు. 3.30 లక్షలు ఉంటుందన్నారు.

Advertisement
Advertisement