Sakshi News home page

బోల్తా కొట్టింది..ప్రమాదం తప్పింది

Published Sat, Sep 23 2017 10:29 AM

car accident in manubolu highway - Sakshi

మనుబోలు : మండలంలోని కాగితాలపూరు క్రాస్‌ రోడ్డు సమీపంలో శుక్రవారం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. కోవూరు మండలం ఇనమడుగు గ్రామానికి చెందిన ఎరకపల్లి రవీంద్రారెడ్డి కారులో  కోటకు వెళ్లి తిరిగి వçస్తున్నాడు. ఈ క్రమంలో కాగితాలపూరు క్రాస్‌రోడ్డు వద్ద  డివైడర్‌ను ఢీకొని కారు అదుపు తప్పి బోల్తా పడింది. కాగా ఈ ప్రమాదంలో రవీంద్రరెడ్డికి ఎటువంటి గాయాలు కాలేదు.

Advertisement

What’s your opinion

Advertisement