సాక్షి ప్రతినిధి, ఏలూరు :పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. చింతలపూడి మార్కెట్
యార్డు పరిధిలో ఈ ఏడాది మొదట్లో పత్తి విక్రయాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై మార్కెట్ కమిటీ సెక్రటరీ ఇన్చార్జి టీటీఎస్వీవీ నారాయణ ఇంటిపై మంగళవారం ఉదయం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పత్తి కొనుగోళ్ల పత్రాలను స్వాధీనం చేసుకుని ఆయన్ను విచారించినట్టు తెలిసింది. ఈ ఏడాది తొలినాళ్లలో పత్తి దిగుబడులకు గిట్టుబాటు ధర రాలేదు. దీంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను తెరిచింది. క్వింటాల్ పత్తికి రూ.4,500 వరకు గిట్టుబాటు ధర ప్రకటించింది.
చింతలపూడి మార్కెట్ యార్డు అధికారులు, సీసీఐ సిబ్బంది, దళారులు కుమ్మక్కై తక్కువ ధరకే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేశారు. క్వింటాల్కు రూ.3,600 చొప్పున మాత్రమే చెల్లించి ఎక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించారు. పత్తిని యార్డుకు తీసుకురాకుండా నేరుగా వ్యాపారులకే విక్రయించేలా రైతుల్ని ప్రోత్సహించారు. రశీదుల్లో మాత్రం గిట్టుబాటు ధర చెల్లించనట్టు, విక్రయాలన్నీ దాదాపుగా యార్డులోనే జరిగినట్టు లెక్కలు తారుమారు చేశారు. కుకునూరు మార్కెట్ యార్డు కూడా చింతలపూడి పరిధిలోకి రాగా, పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతుల నుంచి అందిన ఫిర్యాదులపై రంగంలోకి దిగిన సీబీఐ.. మార్కెట్ యార్డు సూపర్వైజర్లతో పాటు సీసీఐ బయ్యర్ల ఇళ్లను కూడా తనిఖీ చేసింది. ఆ క్రమంలోనే మార్కెట్ కమిటీ సెక్రటరీ ఇన్చార్జి నారాయణ ఇంటిపై దాడులు చేసినట్టు తెలుస్తోంది.
ఏఎంసీ కార్యదర్శిపై సీబీ‘ఐ’
Published Wed, Jul 22 2015 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement