సాక్షి, విశాఖపట్నం: ఇన్నాళ్లు సరైన పర్యవేక్షణ లేక ఆదరణ అంతంతమాత్రంగా ఉన్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సూపర్ బజార్లు మళ్లీ గాడిలో పడుతున్నాయి. వీటిని బలోపేతం చేసేందుకు జీసీసీ పాలకవర్గం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాల నిస్తున్నాయి. క్రమక్రమంగా అమ్మకాల జోరందుకుంటున్నాయి. సిబ్బందిలో కూడా పారదర్శకత పెరుగుతోంది. జీసీసీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాడేరు, అరకు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, అడ్డతీగలలో సూపర్బజార్లు నడుస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్లకు ధీటుగానే ఈ సూపర్బజార్లు పని చేస్తున్నాయి. ఇన్నాళ్లు వీటి లో పనిచేసే సిబ్బందిని పర్యవేక్షించే నాథుడు లేక... ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు. కొంతమంది సిబ్బందైతే అందిన కాడకి దోచేసి వీటిని నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.పి.ఎస్.రవిప్రకాష్ వీటిపై ప్రత్యేక దష్టి పెట్టారు.
ఆకస్మిక తనిఖీలు చేస్తూ సూపర్ బజార్లలో అమ్మకాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. క్షేత్ర స్థాయిలో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, వారు కాజేసిన సొమ్ము వసూలు చేస్తున్నారు. మరో పక్క సూపర్ బజార్లలో జరిగే క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆన్లైన్ చేశారు. ఖర్చు చేసే ప్రతీరూపాయితో పాటు వచ్చే ప్రతీ పైసా అకౌంట్బులిటీ అయ్యే విధంగా ఆన్లైన్ అకౌంటింగ్ సిస్టమ్ను అమలులోకి తీసుకొచ్చారు. పైగా ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో విశాఖ జీసీసీ కార్యాలయంలోని తన చాంబర్ నుంచే తెలుసుకునేందుకు వీలుగా ప్రతీ సూపర్ బజార్లోనూ క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాడేరులో ఈ కెమెరాలను అమర్చారు.
ప్రస్తుతం ప్రతి నెలా రంపచోడవరం సూపర్బజార్ ద్వారా రూ.12 లక్షలు, పాడేరు, అడ్డతీగల బజార్ల ద్వారా రూ.పదేసి లక్షలు, అరకు, సీతంపేట బజార్ల ద్వారా రూ.రెండేసి లక్షల చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఐదు బజార్ల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల వరకు అమ్మకాలు సాగుతుండగా, వీటిని రూ.కోటికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు జీసీసీ వైస్ చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. భవిష్యత్తులో ప్రయివేట్ సూపర్ మార్కెట్లకు ధీటుగా వీటిని మరింత ఆధునికీకరించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. వీటిని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టి అమ్మకాలను పెంచి లాభాలబాట పట్టేలా చర్యలు తీసుకు న్నామని, సిబ్బందిలో కూడా జవాబుదారీతనం తీసుకొచ్చామని చెప్పారు. వీటిని బలోపేతం చేసిన తర్వాత వీటిని మరింత విస్తరించే చర్యలు చేపడతామని తెలిపారు.
జీసీసీ సూపర్ బజార్లలో సీసీ కెమెరాలు
Published Wed, Mar 11 2015 2:01 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ
రూ.947 కోట్ల మోసం.. త్వరలో బిల్డప్ బాబాయ్ ఆస్తుల వేలం.. ఎన్సీఎల్టీ నోటీసులు
టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్రెడ్డి
అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్ చల్
Watch Live: కైకలూరులో సీఎం జగన్ ప్రచార సభ
అలా అయితేనే ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్.. ఆ రెండు జట్లు కన్ఫామ్!?
ముంబై గెలిస్తే.. కేకేఆర్ కేకే! ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫామ్!?
నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం
సీఎస్కేకు షాకిచ్చిన గుజరాత్.. ఘన విజయం
తప్పక చదవండి
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement