సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్లీ రెండోసారి మోసగించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరి గౌతమ్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మరో కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్రం మెడలు వంచైనా సరే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉందన్నారు.
కాని ఆయన ప్రజల ప్రయోజనాలను కాపాడకుండా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముందే కేంద్రంతో చర్చలు జరిపి ఉంటే కొద్దిగా అయినా రాష్ట్రానికి న్యాయం జరిగేదని ఆభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోగా బడ్జెట్లో నిధులు మంజూరు చేయించటంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కావాలో, లేక పదవి కావాలో తేల్చుకోవాలని వెంకయ్యను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు.
నూతన రాష్ట్రంలో విమానాశ్రయాలు, ప్రాజెక్ట్లు, ఆరులైన్ల రహదారుల నిర్మాణం, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు.. ఇలా అనేకం వస్తాయని చంద్రబాబు చెప్పినా కేంద్రం ఒక్క పైసా కూడా విదల్చలేదని మండిపడ్డారు. కర్నూలులో కోచ్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి ఉండేదని చెప్పారు. రూ.20 వేల కోట్ల అవసరం ఉన్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్కు రూ.100 కోట్లు కేటాయించడాన్ని చూస్తే దివంగత వైఎస్సార్ మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రానికి ఇష్టం లేనట్టుగా ఉందని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో పార్టీ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంపై బాబు విమర్శలు ప్రజల్నిమోసగించేందుకే
Published Mon, Mar 2 2015 2:38 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం
మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
భారత్ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్గాంధీ
బీజేపీ నేతలు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
నగరం ఓటెత్తాలని..
తప్పక చదవండి
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
- నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
- Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
- Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
Advertisement