మక్తల్, న్యూస్లైన్: తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు తెలుగుజాతి ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడుకు గుర్తుకు రాలేదా? అని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, గోపాల్రె డ్డి ధ్వజమెత్తారు. మంగళవారం వారు మక్తల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున మద్దతు ఇస్తూ కేంద్రానికి లేఖ రాసి ఇచ్చారన్నారు.
తెలంగాణకు కేంద్రం అనుకూలంగా స్పందించి సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు కూడా ఆయన సానుకూలంగా స్పం దించి స్వాగతించారని గుర్తుచేశారు. ఇంతకాలం రెండుకళ్ల సిద్ధాంతం పాటించిన ఆయన అసలు స్వరూపం బయటపడిందన్నారు. ఎన్డీయే హయాంలో తాను ఒక్క ఫోన్కాల్తో తెలంగాణను ఆపగలిగానని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నాడని బహిరంగంగా ప్రకటించడమే అందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పడితే తిండి గింజలు కరువవుతాయని మంత్రి శైలజనాథ్ అసత్య ప్రచారం చేయడం తగదన్నారు.
కరీంనగర్ జిల్లా రైతులు పది జిల్లాలకు సరిపడా ధాన్యం పండిస్తున్నారని తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దళిత ఉద్యోగులు సైతం తెలంగాణ కావాలని కోరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ను సీమాంధ్ర ప్రాంతం వారు అభివృద్ధి చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్లో చాలా రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడులు పెట్టడం వల్ల అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్పార్టీ కట్టుబడి ఉందని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీమాంధ్ర నాయకులు ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన సమైక్య సదస్సును రద్దు చేసుకోవాలని సూచించారు. ఆల్మట్టి డ్యాం పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్సీల బృందం అనంతరం మక్తల్ నుంచి ఎమ్మెల్సీలు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం పరిశీలనకు వెళ్లారు. ఆల్మట్టి డ్యాం నీటి నిల్వలను రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలిస్తుందని వారు తెలిపారు.
చంద్రబాబు తెలంగాణ ద్రోహి
Published Wed, Sep 4 2013 4:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement