'ఆయనే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'ఆయనే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు'

Published Thu, Apr 30 2015 2:36 PM

'ఆయనే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు' - Sakshi

రాజకీయంగా తమను ఎదుర్కోలేకే చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రసాదరెడ్డి హత్యను రాజకీయ హత్య కాదంటూ డీఐజీ, ఎస్పీ ప్రకటించడం దారుణమని ఆయన చెప్పారు.

పోలీసుల అండదండలతోనే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని అనంత ఆరోపించారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న హత్యాకాండపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న హత్యాకాండపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement