కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం ఉండొచ్చనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకేతాలిచ్చినట్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, ఈ సందర్భంగా అలాంటి సంకేతాలు ఇచ్చారని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీతో భేటీ అయిన అనంతరం ఆ వివరాలను దిగ్విజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఉన్నా.. పన్ను రాయితీలు మాత్రం పదేళ్ల పాటు కొనసాగుతాయని, పోలవరం ప్రాజెక్టు తప్పనిసరిగా వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా ఉన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోనియా సూచించారని, సీమాంధ్రకు కేజీ బేసిన్ గ్యాస్ కేటాయింపుపై దృష్టి పెట్టారని, సోనియాతో అనేక అంశాలపై నాయకులు చర్చించారని అన్నారు.
సీమాంధ్రకు ప్రత్యేక పార్టీ కమిటీ, ప్రత్యేక ఎన్నికల కమిటీ, ప్రత్యేక మేనిఫెస్టో కమిటీ కొన్నిరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమ, కోస్తాంధ్రలో మార్చి నెలాఖరులో బహిరంగ సభలుంటాయని, వాటికి సోనియా, రాహుల్, మన్మోహన్లను నాయకులు ఆహ్వానించారని కూడా దిగ్విజయ్ చెప్పారు.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందని, దేశంలోనే అగ్రస్థాయి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాలు కూడా మళ్లీ అగ్రస్థానం కోసం పోటీ పడతాయని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పడతాయని, పరస్పరం సహకరించుకుంటాయని ఆయన అన్నారు. సీమాంధ్రకు ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇచ్చామని, అయితే పన్ను రాయితీలు మాత్రం పదేళ్ల పాటు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రత్యేక హోదా కింద 90శాతం వరకు కేంద్ర గ్రాంటులు అందుతాయన్నారు. కొత్త రాజధాని ఎక్కడుండాలి, అలాగే కొత్త హైకోర్టు ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశాలను నిపుణుల కమిటీ చూసుకుంటుందని తెలిపారు. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర, అపాయింటెడ్ డే కోసం తాము ఎదురు చూస్తున్నామని, అవి రాగానే కొత్త రాష్ట్రం ఏర్పాటవుతుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
విలీనంపై కేసీఆర్ సంకేతాలిచ్చారు: దిగ్విజయ్
Published Wed, Feb 26 2014 12:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement