నివాసం, టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మించేందుకే..
ఎకరా విలువ రూ.3 కోట్ల నుంచి 4 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయవాడ సమీపంలో నాలుగెకరాల స్థలం కొనుగోలు చేసినట్టు తెలిసింది. పోరంకి సమీపంలో ఉన్న ఈ స్థలంలో ఇల్లు, పక్కనే పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనం నిర్మించాలని కొనుగోలు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ భూమిని చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారని పార్టీ వర్గాలు చెబుతుండగా, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కొన్నట్లు ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. సాధ్యమైనంత తొందరగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని భావించినా తాత్కాలికంగా కొంత సమయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది.
విజయవాడ లోక్సభ సభ్యుడు, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని సంస్థకు చెందిన బస్సులు నిలిపే స్థలం సమీపంలో కొత్త ఆటోనగర్ నుంచి ఎనికేపాడు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకరా మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు సమాచారం. ఈ ప్రాంతం పోరంకి గ్రామం పరిధిలోకి వస్తుందని, అయితే కచ్చితంగా ఎప్పుడు కొనుగోలు చేసింది తెలియదని టీడీపీ స్థానిక నాయకుడొరు చెప్పారు. పార్టీ ఏపీ శాఖకు ప్రత్యేకంగా కార్యాలయం నిర్మించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు స్థలం కొనుగోలు చేశారని ఆ నాయకుడు తెలిపారు.
ఆ అతిథిగృహానికి వాస్తు సరిగా లేదు
విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించేందుకు ఇటీవల లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం (స్టేట్ గెస్ట్హౌస్) వాస్తు సరిగా లేదని సీఎం చంద్రబాబు వ్యక్తిగత సిద్ధాంతి రాఘవయ్య తేల్చినట్లు సమాచారం.
ఇటీవల ఆ అతిథిగృహాన్ని పరిశీలించిన రాఘవయ్య ఆ భవనానికి వాస్తు సరిలేదని, అందువల్ల రాత్రిపూట అందులో బస చేయవద్దని చెప్పినట్లు తెలిసింది. అందువల్లే చంద్రబాబు ఇటీవలి కాలంలో విజయవాడలో రాత్రిపూట బసచేస్తే హోటళ్లలోనే ఉంటున్నారు. హైదరాబాద్లోని బాబు నివాసంతో పాటు ఎన్టీఆర్ భవన్లో కూడా రాఘవయ్య సూచనల మేరకే గతంలో మార్పులు చేసిన విషయం తెలిసిందే.
విజయవాడలో భూమి కొన్న బాబు?
Published Sat, Jan 17 2015 2:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement