Sakshi News home page

ఇద్దరు చిన్నారుల మృతిపై చంద్రబాబు విచారం

Published Wed, Jun 24 2015 9:53 PM

chandrababu feel saarrow about two childerns died

సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా కొసిగి రైల్వే స్టేషన్‌లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పుల్లెల శ్రీరామచంద్రుడు మృతికి సంతాపం కవి, పండితుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల శ్రీరామచంద్రుడు మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వాల్మీకి రామాయణం, సహా పలు సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించి తెలుగువారికి ఆయన చిరస్మరణీయుడు అయ్యారని సీఎం శ్లాఘించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement