గుంటూరు: రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వారి తాత జాగీరా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా పొందుగుల గ్రామంలో ఆయన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో సంపద సృష్టించింది, ఉద్యోగాలు సృష్టించింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చే పరిస్థితిలేదని చెప్పారు. తెలుగు జాతిపై కుట్రపన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చినట్లు రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఎవరూ ఓడిపోకుండా అందరూ గెలవాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆందోళన చేసేవారిని కూర్చోబెట్టి మాట్లాడి, సమస్యను పరిష్కరించాలన్నారు. అందరూ రోడ్డు మీద ఉన్నారు, కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే సత్తాలేకపోతే రాజీనామా చేయాలన్నారు.
దేశాన్ని దోచుకుంటుంటే యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. దేశంలోని సంపదంతా సోనియా కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. సోనియా గాంధీకి డబ్బు పిచ్చని, బ్రిటీష్ వారి మాదిరిగా దోచుకుంటున్నారన్నారు. అల్లుడు వార్దా కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపించారు. మనకు మనకు తగాదా పెట్టిన దుర్మార్గురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రధాని శాఖలో 189 పైళ్లు మాయమైతే ఫైళ్లకు కాపలాదారుడినా అని ప్రధాని అనడాన్ని ఆయన తప్పుపట్టారు. ఫైళ్లను కాపాడలేని ప్రధాని దేశాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు.
రాష్ట్రం కాంగ్రెస్వారి తాత జాగీరా?: చంద్రబాబు
Published Sun, Sep 1 2013 3:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement