'చంద్రబాబు పీకల్లోతు కూరుకుపోయారు' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పీకల్లోతు కూరుకుపోయారు'

Published Sat, Jun 27 2015 10:56 AM

chandrababu naidu fully plunged  into Vote for cash scam

విశాఖ : ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీకల్లోతు కూరుకుపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలనే తప్ప...పాలన మీద చంద్రబాబు దృష్టి పెట్టడం లేదని ఆయన శనివారమిక్కడ విమర్శించారు.  కేంద్రం నుంచి విభజన చట్టంలోని అంశాలను అమలు పరచడంలో రాష్ట్రం విఫలమైందన్నారు. ఎన్డీయేలో మిత్రపక్షమైనప్పటికీ రాష్ట్రానికి సాధించిందేమీ లేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో కార్యచరణ రూపొందించి ప్రభుత్వంపై పోరాడతామని ఆయన తెలిపారు.

 

Advertisement
Advertisement