రావులపాలెం :జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఊడగొట్టారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా విమర్శిం చారు. ఆదర్శ రైతుల వ్యవస్థ రద్దు నిర్ణయానికి నిరసనగా మంగళవారం స్థానిక కళా వెంకట్రా వు సెంటర్లో మానవహారం నిర్వహంచి, జా తీయ రహదారిని దిగ్బంధించారు. ఆదర్శ రైతుల సంఘ రాష్ర్ట అధ్యక్షుడు నలగం శేఖర్, కార్యదర్శి ఏడుకొండలు, జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయరెడ్డి నాయకత్వంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, వైస్ ఎంపీపీ దండు వెంకటసుబ్రహ్మణ్య వర్మ, కాంగ్రెస్ నాయకుడు ఆకుల రామకృష్ణ మద్దతు తెలి పారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు, వ్యవసాయాధికారులకు మధ్య వారధిగా ఆదర్శ రైతు వ్యవస్థను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవస్థను రద్దు చేయడానికి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు చర్యలు చేపట్ట డం సమంజసం కాదన్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల సుమారు 29 వేల మంది నిరుద్యోగులుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టకపోయినా, ఎనిమిదేళ్లుగా సేవలందిస్తున్న ఆదర్శరైతులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదేనా విజన్ 2020 అని దుయ్యబట్టారు. ఆదర్శరైతులకు అన్యాయం జరగకుండా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఆదర్శరైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆదర్శ రైతులు రోడ్డున పడే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తాననడం సమంజసం కాదన్నారు. రాజకీయ పార్టీల సహకారంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఆదర్శరైతులకు సాంకేతిక నైపుణ్యంపై ప్రభుత్వమే శిక్షణ ఇప్పించాలని కోరారు.
స్తంభించిన ట్రాఫిక్
ఆదర్శ రైతుల ఆందోళన ఫలితంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలి గింది. సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంభిం చింది. కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశా రు. కార్యక్రమంలో ఆదర్శరైతు నాయకులు వెంకటరమణ, టి.జానకిరామ్, కె.వీరాంజనేయులు, టి.ఆదిత్యారెడ్డి, ఎ.చినవెంకట రమణ, వీరరాజు తదితరులు పాల్గొన్నారు.
బాబు రాక.. జాబు పోక
Published Wed, Jul 16 2014 2:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement