'సీమాంధ్రుల ఆత్మగౌరవాన్నిచంద్రబాబు తాకట్టు పెట్టారు' | Sakshi
Sakshi News home page

'సీమాంధ్రుల ఆత్మగౌరవాన్నిచంద్రబాబు తాకట్టు పెట్టారు'

Published Tue, Aug 27 2013 7:29 PM

'సీమాంధ్రుల ఆత్మగౌరవాన్నిచంద్రబాబు తాకట్టు పెట్టారు' - Sakshi

కర్నూలు:.రెండు కళ్ల సిద్దాంతాన్ని అవలంభిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమాంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని భూమా నాగిరెడ్డి విమర్శించారు.   సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకూ ఎగసి పడుతున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు.
 
 హైదరాబాద్ నగరంలో చంద్రబాబు ఆస్తుల కాపాడుకోవడానికి జై తెలంగాణ అంటున్నారని భూమా మండిపడ్డారు. వ్యాపారాల ముసుగులో రాష్ట్ర నాయకులు సీమాంధ్ర ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదన్నారు.

Advertisement
Advertisement