టీడీపీ నేతలకు చంద్రబాబు ఉద్బోధ | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు చంద్రబాబు ఉద్బోధ

Published Mon, Sep 4 2017 2:13 PM

టీడీపీ నేతలకు చంద్రబాబు ఉద్బోధ - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయని, అందుకనుగుణంగా నాయకులు మారాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నాయకులకు ఉద్బోధించారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్సులో టీడీపీ అభినందన సభ సోమవారం జరిగింది. గెలుపు ఓటములు ఎప్పుడూ ప్రభావం చూపిస్తాయని పేర్కొంటూ.. నంద్యాల ఎన్నికల ఫలితాలు కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రభావం చూపించాయని చెప్పారు. కార్యకర్తలు బాగా పనిచేశారని కితాబిచ్చారు.

టెక్నాలజీని పాజిటివ్‌గా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నాయకులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. 80 శాతం సంతృప్తి సాధిస్తే ప్రజల మద్దతు మనకే ఉంటుందన్నారు. ప్రభుత్వపరంగా అన్నీ సక్రమంగా చేస్తే ప్రజలకు చెప్పుకోవడానికి ప్రతిపక్షాలకు ఏమీ ఉండదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రిసార్టుకు సమీపంలోనే పార్టీ కార్యాలయం రాబోతున్నదని చంద్రబాబు తెలిపారు.
 

Advertisement
Advertisement