నేడు తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన | Sakshi
Sakshi News home page

నేడు తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

Published Mon, Oct 28 2013 8:57 AM

chandrababu naidu to tour in east godavari

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తుని, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగుతుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడినుంచి రోడ్డు మార్గం గుండా మధ్యాహ్నం 12 గంటలకు అన్నవరం మీదుగా తొండంగి మండలంలో పర్యటిస్తారు.

సాయంత్రం వరకు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలు, ఇతర ప్రాంతాలను పరిశీలించి, సాయంత్రం నాలుగు గంటల సమయానికి పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్తారు. తణుకులోని ఆంధ్రా సుగర్స్లో రాత్రి బస చేసి, మంగళవారం నాడు జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి నుంచి కృష్ణా జిల్లాకు వెళ్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement