'అడ్డంగా దొరికినా..దుష్ప్రచారం ఆపవా బాబూ' | Sakshi
Sakshi News home page

'అడ్డంగా దొరికినా..దుష్ప్రచారం ఆపవా బాబూ'

Published Wed, Jun 3 2015 6:22 PM

'అడ్డంగా దొరికినా..దుష్ప్రచారం ఆపవా బాబూ' - Sakshi

గుంటూరు: రేవంత్ వ్యవహారంలో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, వెంకటరమణ, అంజాద్ బాషాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ చేపట్టిన సమర దీక్షలో ఎమ్మెల్యేలు బుధవారం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తో కుమ్మక్కైంది మేము కాదు.. 2009 ఎన్నికల్లో మహాకూటమి అంటూ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది నువ్వు కాదా చంద్రబాబూ అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని టి.హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే చంద్రబాబును A-1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement