సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగ నేపథ్యంలో పంపిణీ చేపిన ఉచిత సరుకులపై విజిలెన్స్తో గాని, ముగ్గురు సభ్యులతో కూడిన ఐఏఎస్ అధికారులతో గాని విచారణ జరపాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సరుకుల పంపిణీలో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు తెలు స్తోందన్నారు. ప్రభుత్వం అందించిన సరుకుల ధరల కన్నా.. స్థానిక, మార్కెట్లో ధరలే తక్కువగా ఉన్నాయని చెప్పారు. అటువంటప్పుడు హోల్సేల్ గా కొనుగోలు చేస్తే వాటి ధర మరింత తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం ఉచిత సరుకులందిస్తున్నట్టు ప్రకటించిం దని,
అప్పట్లో రూ. 287 కోట్ల అవసరమవుతున్నాయన్నారని, కానీ ప్రస్తుతం 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్టు చెబుతున్నారన్నారు. పం డగకు ఉచితంగా సరుకులందించడాన్ని తాము తప్పుబట్టడం లేదని, కానీ ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పారు. అధిక ధరలకు కొనుగోలు చేసిన సరుకులైనా.. నాణ్యంగా లేవన్నారు. కొన్నిచోట్ల తక్కువ ధరకు వచ్చే పాలిష్డ్ పప్పు, ఇంకొన్ని చోట్ల నాశిరకంగా ఉందన్నారు. అలాగే 30 కోట్ల రూపాయలతో కొనుగోలుు చేసిన సరుకుల బ్యాగులు ఎక్కడా కానరాలేదన్నారు. మరీ బ్యాగులు ఏమైనట్టు అని ప్రశ్నించారు. తూకంలో కూడా తగ్గుదల ఉన్నట్టు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన పథకాన్ని... ఎందుకు ఆదరాబాదరాగా చేపట్టాల్సి వచ్చిందో తెలి యడం లేదన్నారు. దుర్వినియోగమైన ప్రజాధనంపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.
సంబరాలకెలా వస్తాం..?;
ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే తాము సంబరాల్లో ఎలా పాల్గొంటామని రాజ న్నదొర ప్రశ్నించారు. పింఛన్లు పొందేం దుకు అన్ని అర్హతలున్నా అంద కపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది మనో వ్యాధితో మరణిస్తున్నారన్నారు. అధికారుల తప్పి దం వల్ల రాష్ట్రంలో 7 లక్షల కుటుంబా లు, జిల్లాలో 14 వేల కుటుంబాల రేషన్కార్డుల ఆధార్సీడింగ్ జరగకపోతే వారికి సరుకులు ఇవ్వడం లేదని, రైతుల రుణమాఫీ కూడా సక్ర మంగా అమలు చేయకపోవడంతో పాటు హుద్హుద్ తుపాను పంట నష్ట పరిహారాన్ని కూడా పాత బకాయిలకు బ్యాంకులు జమ చేస్తుంటే రైతులు పండగ ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ కారణంగానే తాము సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేదని చెప్పారు.
‘చంద్రన్న కానుక’పై విచారణ జరపాలి
Published Wed, Jan 14 2015 3:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement